Begin typing your search above and press return to search.

హోదా కాదు కానీ మోడీ గారి మీద పడ్డారే... ?

By:  Tupaki Desk   |   18 Feb 2022 1:30 AM GMT
హోదా కాదు కానీ మోడీ గారి మీద పడ్డారే... ?
X
దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన తనదైన శైలిలో ఎనిమిదేళ్ళుగా పాలిస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చారు అని బీజేపీ అంటుంది. కానీ ఏపీకి తీరని అన్యాయం చేశారని ఇతర పక్షాలు అంటాయి. వాటి సంగతి అలా ఉంచితే మళ్లీ ప్రత్యేక హోదా ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ రచ్చకు దారి తీస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో వైసీపీ పూర్తిగా విఫలం అయిందని టీడీపీ ఆరోపిస్తోంది. అంతే కాదు, వైసీపీ ఎంపీలు ఆ విషయంలో ఎక్కడా మాట్లాడం లేదని, పోరాటాలు చేయడం లేదని కూడా అంటున్నారు.

 శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడు అయితే ప్రత్యేక హోదాను సాధించడం వైసీపీకి చేతకాదు అని అంటున్నారు. తాము మాత్రమే ఏపీకి హోదా కావాలని గట్టిగా అడుగుతున్నామని కూడా అన్నారు.

ఈ నేపధ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ అయితే గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం చేయడంలేదు అని టీడీపీ నేతలు అంటున్నారు.

మేము మాత్రమే హోదా నినాదాన్ని సజీవంగా ఉంచాం, టీడీపీ హోదాను పూర్తిగా తాకట్టు పెట్టేసింది. అది నిజం కాదా అని ప్రశ్నించారు. మీకేనా తెలివి తేటలు ఉన్నది మాకు లేవా అని ఫైర్ అయ్యారు

అంతే కాదు, హోదా కోసం ఏం చేయమంతారు, ప్రధాని నరేంద్ర మోడీ పీక నొక్కలేం కదా అని కూడా ఆయన మండిపడ్డారు. హోదా కోసం ఎన్ని  చేయాలో అంతా చేస్తున్నాం, అంతే తప్ప మేము ఏమీ చేయలేదు అన్నది పూర్తిగా తప్పుడు ప్రచారం, అబద్ధపు ప్రచారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు చూస్తే ఏపీని అడ్డగోలుగా కాంగ్రెస్ నాడు విభజిస్తే టీడీపీ వారు ఏం చేశారు అని కూడా తమ్మినేని నిలదీశారు.

ఇదిలా ఉంటే టీడీపీ వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం వరకూ బాగానే ఉంది కానీ మధ్యలో మోడీని ఎందుకు తీసుకువస్తున్నారు అన్నదే చర్చ. ఏది ఏమైనా స్పీకర్ మాత్రం ఎక్కడా తగ్గేది లేదని అంటున్నారు.