Begin typing your search above and press return to search.

ఏపీ స‌చివాల‌యంలో మ‌రొకరి పాజిటివ్ ...15కి చేరిన కేసులు !

By:  Tupaki Desk   |   13 Jun 2020 11:50 AM GMT
ఏపీ స‌చివాల‌యంలో మ‌రొకరి పాజిటివ్ ...15కి చేరిన కేసులు !
X
ఏపీలో వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజు, రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను కూడా ఈ వైరస్ వద‌ల‌డం లేదు. తాజాగా ఏపీ స‌చివాల‌యంలో మ‌రొక‌రికి పాజిటివ్ గా తేలింది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ఇరిగేష‌న్ డిపార్ట్‌ మెంట్‌ లో ప‌ని చేస్తున్న ఉద్యోగికి వైరస్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యిందని, తాజాగా న‌మోదైన కేసుతో క‌లిపి ఏపీ స‌చివాల‌యంలో వైరస్ సోకిన వారి సంఖ్య 15కు చేరింది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.

ఇకపోతే , రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 222 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 186 కేసులు ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 33 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5858కు చేరింది. తాజాగా కృష్ణా జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో.. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 82కి చేరింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 2,591 యాక్టివ్ కేసులు ఉన్నాయి.