Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

By:  Tupaki Desk   |   1 Sep 2020 5:00 PM GMT
చంద్రబాబుకు పోలీసుల నోటీసులు
X
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ పోలీసులు షాకిచ్చారు. తాజాగా ఆయనకు నోటీసులు పంపారు. చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఈ నోటీసులను చంద్రబాబుకు పంపినట్టు తెలిసింది.

వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. ఓం ప్రతాప్ ఆత్మహత్యకు మంత్రి పెద్దిరెడ్డి వర్గమే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి లేఖ కూడా రాశారు.

ఈ క్రమంలోనే ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు పోలీసులు నోటీసులు పంపారు. సీఆర్పీఎస్ సెక్షన్ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ ఈ నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని సదురు నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలోగా కార్యాలయానికి హాజరై ఆధారాలు ఇవ్వాలని డీఎస్పీ ఈ నోటీసుల్లో కోరారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం బండకాడ ఎస్సీ కాలనీకి చెందిన ఓం ప్రతాప్ గత నెల 24న రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు సీఎంపై మద్యం విధానంపై అసభ్యపదజాలంతో విమర్శిస్తూ వీడియోలో మాట్లాడాడు. ఆ వీడియో వైరల్ కాగా.. ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది.