Begin typing your search above and press return to search.

విజయ్ మాల్యా కు మరో షాక్.!

By:  Tupaki Desk   |   1 Jan 2020 10:34 AM GMT
విజయ్ మాల్యా కు మరో షాక్.!
X
దేశంలోని బ్యాంకులకు దాదాపు 12వేల కోట్ల రూపాయిలకు ఎగ్గొట్టి విదేశాల కు పారి పోయిన కింగ్ ఫిషర్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ఊహించని గట్టి షాక్ తగిలింది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొట్టి 2016 మార్చిలో దేశం దాటి లండన్ కు విజయ్ మాల్యా పారిపోయాడు.

ఆయనను భారత్ కు రప్పించేందుకు భారత సర్కారు పోరాడింది. 2017లో అరెస్ట్ అయిన విజయ్ మాల్యా బెయిల్ మీద లండన్ లోనే ఉన్నాడు.

ఇప్పటికే విజయ్ మాల్యా ఆస్తులను కోర్టు జప్తు చేసింది. దాదాపు 13వేల కోట్ల విలువైన ఈ ఆస్తులను ఎస్ బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం వేలం వేయడానికి విచారణ జరుపుతున్న పీఎంఎల్ఏ కోర్టు అనుమతిచ్చింది. ఈనెల 18 తర్వాత వేలం వేయాలని కోర్టు తీర్పునిచ్చింది. సీజ్ చేసిన ఆస్తుల లిక్విడేషన్ కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ తెలిపిన నేపథ్యంలో మాల్యా ఆస్తులను అమ్మి ఆయన బాకీ తీర్చుకోవడానికి బ్యాంకులు రెడీ అయ్యాయి.

ఇదే జరిగితే విజయ్ మాల్యా ఆస్తులు కోల్పోవడం తో జైలు శిక్ష కూడా తప్పించుకోవడం కష్టమే.. మరి దీనిపై ఏం జరగనుందనేది వేచిచూడాలి.