Begin typing your search above and press return to search.

బాబు ఇంటి ముందు సచ్చిపోతా అన్నా రాంబాబు

By:  Tupaki Desk   |   1 Nov 2016 5:37 AM GMT
బాబు ఇంటి ముందు సచ్చిపోతా అన్నా రాంబాబు
X
ఇతర పార్టీల నుంచి నేతలు టీడీపీలోకి రావడంతో పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలు ఇబ్బంది పడుతున్నారు. వలస నేతలు సృష్టిస్తున్న సమస్యలపై అధినేత చంద్రబాబుకు చెబుతున్నా స్పందించకపోవడంతో వారు బరస్టవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జ్ అన్నా రాంబాబు ఇదే సమస్యపై పరోక్షంగా చంద్రబాబుపైనా మండిపడ్డారు.

గిద్దలూరులో నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన అన్నా రాంబాబు ఈ సందర్భంగా ఉద్వేగంగా మాట్లాడారు. వలసదారులు పార్టీలోకి వచ్చి నిజమైన పార్టీ కార్యకర్తలను అణచివేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి కోసం తానిచ్చిన ప్రతిపాదనలను పక్కన పడేస్తున్నారని చెప్పారు. గిద్దలూరు నియోజకవర్గం నుంచి తనను తరిమివేయడమే ధ్యేయంగా పెట్టుకుని కొందరు పనిచేస్తున్నారని పరోక్షంగా ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అశోక్ రెడ్డి అనర్హులకు పించన్లు ఇప్పిస్తున్నారని విమర్శించారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, ఆస్తులు పోతే ఉపాధి హామీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటానని అవినీతికి మాత్రం పాల్పడే ప్రసక్తే లేదన్నారు రాంబాబు.

వలస నేతల నుంచి ఎదురవుతున్న సమస్యలపై త్వరలోనే పార్టీ పెద్దలను కలుస్తానని చెప్పారు. అటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోతే నాలుగైదు రోజులు చూసి సీఎం చంద్రబాబు ఇంటి ముందే ఆత్మార్పణ చేసుకుంటానని అన్నా రాంబాబు అల్టిమేటం ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/