Begin typing your search above and press return to search.

విశాఖలో రిలయన్స్ నౌకలు

By:  Tupaki Desk   |   11 Jan 2016 5:41 AM GMT
విశాఖలో రిలయన్స్ నౌకలు
X
విశాఖపట్టణంలో ప్రముఖ సంస్థ రిలయెన్స్ కంపెనీ నౌకల తయారీ పరిశ్రమను స్థాపించనున్నట్లు సంస్థ అధినేత అనిల్ అంబానీ వెల్లడించారు. విశాఖ పట్నం జిల్లాలో రాంబిల్లి వద్ద ఐదువేల కోట్ల వ్యయంతో ఈ నౌక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

వచ్చే పదిహేను సంవత్సరాలలో నేవి - జలాంతర్గాములు - విమాన వాహక నౌకలు వంటి తయారీరంగంలో మొత్తం మూడుల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అంబానీ వెల్లడించారు. రాంబిల్లి విశాఖకు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రిలయెన్స్ ఇప్పుడు ఇక్కడ అధునాతన నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించనుంది.