Begin typing your search above and press return to search.

ఢిల్లీ డొంక కదిలింది.. తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవుతోందా?

By:  Tupaki Desk   |   29 Aug 2022 3:57 AM GMT
ఢిల్లీ డొంక కదిలింది.. తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవుతోందా?
X
సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి. ఘాటు విమర్శలు.. సంచలన ఆరోపణలు.. పంచ్ మాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. ఎప్పుడేం మాట్లాడాలి.. అన్న విషయంపైన ఫుల్ క్లారిటీ ఉన్న నేతగా ఆయన్ను చెప్పాలి.

చాలామంది టీడీపీ నేతలకు భిన్నంగా ఆయన మాటలు ఉంటాయి. పర్ ఫెక్టు టైమింగ్ ను మొయింటైన్ చేసే ఆయన.. తాజాగా సరికొత్త విషయాల్ని వెల్లడించి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ మూలాల్ని ఆయన ప్రస్తావించి సంచలనంగా మారారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాడేపల్లికి లింకులు ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు లిక్కర్ స్కాం జరుగుతోందని.. ఆదాన్ అనే డిస్టలరీని స్థాపించిన విజయసాయి రెడ్డి స్కామ్ లు చేస్తున్నారన్నారు. ఢిల్లీలో తీగ లాగితే.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్ కు.. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కు ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు.

క్విడ్ ప్రోకోలో భాగంగా జగతి పబ్లికేషన్స్ కు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్లాది రూపాయిల్ని తరలించిందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు.. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయి రెడ్డితో ఆర్థిక సంబంధాలు ఉన్న పనాక శరత్ రెడ్డిని.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారిస్తోందన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డితో పాటు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీలకు సంబంధాలు ఉన్నాయన్న సంచలన ఆరోపణలు చేశారు. మరి.. ఆయన మాటల్లో పస లేదన్న విషయాన్ని అధికార వైసీపీ నేతలు తేల్చి చెబుతారా? లేదంటే మనకెందుకులే అని మౌనంగా ఉండిపోతారో చూడాలి.