Begin typing your search above and press return to search.

మిర్యాల గూడ స్మశాన వాటికలో ఉద్రిక్తత.. అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు

By:  Tupaki Desk   |   9 March 2020 7:53 AM GMT
మిర్యాల గూడ స్మశాన వాటికలో ఉద్రిక్తత.. అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు
X
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తన భర్తను హత్య చేయించిన తండ్రి మారుతీరావు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకోవడం.. మిర్యాలగూడలో అంత్యక్రియలు జరుగుతుండడంతో కడసారి చూసేందుకు అమృత స్మశాన వాటిక వద్దకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య వచ్చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దీంతో అమృత మారుతీరావు డెడ్ బాడీని చూడకుండానే ఆమె వెనుదిరిగింది. మొదట పోలీస్ వాహనం దిగిన అమృత స్మశాన వాటికలోకి వెళ్లింది. ఆ సమయంలో మారుతీరావు డెడ్ బాడీ చూసేందుకు వెళ్లగా ఆ డెడ్ బాడీ చుట్టూ బంధువులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.

అమృతను చూడగానే స్థానికులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తోసుకువచ్చారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అక్కడి నుంచి ఇంటికి అమృతను సురక్షితంగా పంపించారు.

మారుతీరావు అంత్యక్రియలను ఆయన తమ్ముడు శ్రవణ్ కుమార్, మారుతీరావు భార్య గిరిజలు చేశారు. అమృతను కడసారి చూడాలనుకున్న అమృత ఆ చూపును చూడలేకపోయింది.

హైదరాబాద్ లోని ఓ వైశ్యభవన్ లో ఆత్మహత్య చేసుకున్న అమృతరావు డెడ్ బాడీకి హైదరాబాద్ లోనే పోస్టుమార్టం జరిగింది. ఈ ఉదయం ఆయన అంత్యక్రియల కోసం మిర్యాలగూడకు తీసుకొచ్చారు.