Begin typing your search above and press return to search.

వైఎస్ భిక్షతో గెలిచిన జోకర్ జేసీ..

By:  Tupaki Desk   |   30 May 2018 9:57 AM GMT
వైఎస్ భిక్షతో గెలిచిన జోకర్ జేసీ..
X
మహానాడు మాటల మంటలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఓవైపు ప్రతిపక్ష నేత జగన్, మరోవైపు వైసీపీ నాయకులు చంద్రబాబు, అండ్ కో మాట్లాడిన మాటలను ఎండగడుతున్నారు. నిన్న మహానాడులో జేసీ దివాకర్ రెడ్డి ప్రతిపక్షంపై ఆడిపోసుకున్న సంగతి తెలిసింది. తాజాగా జేసీకి గట్టి కౌంటర్ ఇచ్చింది వైసీపీ.

మహానాడు వేదికగా జగన్ పై, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది వైసీపీ పార్టీ.. బుధవారం రాజంపేట పార్లమెంటరీ వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి జేసీ బండారాన్ని బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబాన్ని విమర్శించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుకున్నాడని.. జోకర్ లాంటి జేసీతో విమర్శల దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ఆ విషయాన్ని మరిచిపోయాడని.... ఇప్పుడు ఆ మహానేతనే విమర్శించడం సరికాదన్నారు.

ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత లేని జేసీ తీరు ఇకనైనా మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ కూడా జేసీపై విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీలను మహానాడులో ఎందుకు ప్రస్తావించలేదని శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో జేసీకి ఓటమి తప్పదని అన్నారు. టీడీపీ , బీజేపీలు రెండూ మూకుమ్మడిగా రాష్ట్రాన్ని మోసం చేశాయని రాచమల్లు ఆరోపించారు.