Begin typing your search above and press return to search.

మోదీ ఆట‌విడుపు బాగుందే!

By:  Tupaki Desk   |   10 Sep 2017 12:48 PM GMT
మోదీ ఆట‌విడుపు బాగుందే!
X
దేశాన్ని పాలించే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ప‌సిపాప‌లంటే ఎంతో మ‌క్కువ. ఆయ‌న ఏ కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టినా చిన్నారుల మ‌ధ్యే చేసుకుంటుంటారు. ఇక‌ ఎప్పుడైనా కొంచెం స‌మ‌యం దొరికితే.. ఆ స‌మ‌యాన్ని కూడా పిల్ల‌ల‌తో గ‌డిపేందుకు ఆయ‌న ఇంతో ఇష్ట‌ప‌డ‌తారు. తాజాగా ఇలాంటి సంద‌ర్భ‌మే మోదీలోని ఆప్యాయ‌త‌ను దేశ ప్ర‌జ‌ల‌కు తెలిసేలా చేసింది. చిన్నారులంటే మోదీకి ఎంత ప్రాణ‌మో స్ప‌ష్టం చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ - రోయ దంప‌తులు త‌మ చిన్నారి కూతురు మ‌దీనాతో స‌హా శుక్ర‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. అద్నాన్ స‌మీ దంప‌తుల‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికిన మోదీ... చిన్నారి మ‌దీనాను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నారు. ఆ చిన్నారి బుగ్గ‌ల‌ను ఆప్యాయంగా నిమిరి ఆశీర్వ‌దించారు. స‌మీ దంప‌తులు దాదాపు 40 నిమిషాల పాటు ప్ర‌ధానితో భేటీ అయ్యారు. ఈ స‌మ‌యం అంతా మోదీ ఆ చిన్నారిని చూస్తూనే గ‌డిపారు. ఈ సందర్భంగా వారి మధ్యన నవ్వులు విరబూశాయి. ఈ అనుభవాన్ని - సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ జీవితంలో అది మరిచిపోలేని అందమైన అనుభూతి అని చెప్పారు అద్నాన్‌. ప్రధాని నరేంద్రమోదీ తమను ఎంతో ప్రేమగా ఆహ్వానించారని పేర్కొన్నారు.

మోదీ తమ కూతురుతో ఆడుకున్న తీరు అద్భుతం అని స‌మీ చెప్పారు. ప్రతి సందర్భాన్నీ తాము ఎంత‌గానో ఆస్వాదించామ‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీతో గ‌డిచిన ప్ర‌తి క్ష‌ణం అమూల్య‌మ‌ని తెలిపారు. ఇక‌ ఇప్పుడు ప్ర‌ధాని ఆ చిన్నారితో గ‌డిపిన క్ష‌ణాలు, బుగ్గ‌లు నిమురుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీటికి వీక్ష‌కుల నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌తి ఒక్క‌రూ మోదీ ఆప్యాయ‌త‌కు మురిసిపోతున్నారు. ఈ ఫొటోలు.. ఇప్ప‌టికి లైకులు షేర్లు చాలానే జ‌ర‌గ‌డం విశేషం.