Begin typing your search above and press return to search.

ESI స్కాం పై ఏసీబీ జేడీ రవికుమార్ వివరణ !

By:  Tupaki Desk   |   13 Jun 2020 7:10 AM GMT
ESI స్కాం పై ఏసీబీ జేడీ రవికుమార్ వివరణ !
X
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ESI స్కాం ప్రకంపనలు సృష్టిస్తుంది. ESI నిధుల కేటాయింపులో 2018-19కి సంబంధించి 988 కోట్లలో 150 కోట్ల అవినీతినీ గుర్తించిన ఏసీబీ అవకతవకలకు పాల్పడిన వారిని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ ESI స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు రెండు FIR లు నమోదు చేసినట్టు , అలాగే ఈ కేసులో ఇప్పటి వరకు డైరెక్టర్లు విజయ్ కుమార్, రమేష్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు , జేడీ జనార్దన్, ఉద్యోగులు చక్రవర్తి, వెంకట్రావు, రమేష్ బాబు అరెస్ట్ చేసినట్టు ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు.

ఈ 150 కోట్ల స్కాం లో ల్యాబ్ కిట్ల కొనుగోలు, సర్జికల్, ఆఫీస్ ఫర్నిచర్, ఈసీజీ కొనుగోలు లో అక్రమాలు జరిగినట్టు గుర్తించినట్టు తెలిపారు. మోతంగా ఈ కేసులో ఇప్పటి వరకు19 మంది ముద్దాయిలను గుర్తించామని , ఈ కేసులో భాగంగా మరింత మందిని విచారణ చేయబోతున్నాం అని , అలాగే డాక్యుమెంట్స్ పరిశీలన చేయాల్సి ఉంది అని తెలిపారు.

టెలీహెల్త్ లో ఈసీజీ కి 200 రూపాయలు బదులు 480 వసూలు చేశారు. కాల్ సెంటర్ సర్వీసులు వాడుకున్న వారికి 1.80 బదులు ఎక్కువగా వసూలు చేశారు అని అయన తెలిపారు. అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ తరపున హౌస్ మోషన్ పిటిషన్లు వేసినట్లు తెలిపారు. అయితే , ఈ కేసులో ఇప్పటివరకు ఇతర రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్టు ఇంకా గుర్తించలేదు అని ,అయితే ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎక్కువగా ఉన్నట్టు గుర్తించాం అని తెలిపారు. అవసరం లేకపోయినా, నాణ్యత లేని పరికరాలు మందులు కొన్నారని గుర్తించాం అని , అచ్చెన్నాయుడు లెటర్ ల్యాడ్ ద్వారా అర్దర్లు ఇవ్వాలని ఆదేశించారు అని ,కొనుగోళ్ళకు సంబంధించి ఒకటి, టెలీ మెడిసిన్ కి సంబంధించి విడి విడిగా రెండు FIR లు నమోదు చేసాం అని ఏసీబీ జేడీ తెలిపారు.

ఈ రెండు కేసుల్లో ఏ1గా రమేష్ కుమార్, ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నారు అని తెలిపారు. మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే అచ్చెన్నాయుడ్ని విచారణకు రావాలని కోరలేదనీ , ఆధారాలు సేకరించాం, ఆ ఆదారాల్లో అయన అవకతవకలు చేసినట్టు గుర్తించాం కాబట్టే అరెస్ట్ చేసాం అని అయన తెలిపారు. కాగా, అచ్చెన్నాయుడుకి వైద్యం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని, డాక్టర్ల బృందం అచ్చెన్నాయుడు కి వైద్యం చేసింది అని తెలిపారు.