Begin typing your search above and press return to search.
‘అసహనం’ అన్నోళ్లకి విందు ఇచ్చిన మోడీ
By: Tupaki Desk | 15 Feb 2016 9:54 AM ISTతన సర్కారుపై విమర్శలు చేసినోళ్ల పట్ల ప్రధాని మోడీ పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నారా? అన్న భావన కలిగేలా ప్రధాని మోడీ వ్యవహరించటం గమనార్హం. దేశంలో అసహనం అంతకంతకూ పెరిగిపోతుందన్న వ్యాఖ్యలతో పాటు.. దేశాన్ని విడిచి పెట్టి వెళ్లాలన్న విషయాన్ని తన భార్య తనతో చెప్పిందని చెప్పిన బాలీవుడ్ దిగ్గజ నటుడు అమీర్ వ్యాఖ్యలు దేశం మొత్తాన్ని ఎంతలా కుదిపేశాయో తెలిసిందే.
ఇదే రీతిలో అసహనం మీద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ప్రముఖుల్లో నటి కంగనారౌనత్ కూడా ఉన్నారు. ఇలా వ్యాఖ్యలు చేసిన వీరిద్దరికి ఊహించని రీతిలో ఒక ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ ఇచ్చిన ఒక విందుకు వీరిని ఆహ్వానించారు. మేకిన్ ఇండియా వీక్ వారోత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ ఇచ్చిన ప్రత్యేక విందుకు పలువురు అంతర్జాతీయ.. జాతీయ ప్రముఖుల్ని పిలవటం తెలిసిందే. ఇదే విందుకు తమ సర్కారును ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేసిన అమీర్ ఖాన్.. కంగనారౌనత్ లకు ఆహ్వానం అందటం.. వారు హాజరు కావటం గమనార్హం.
ఇదే రీతిలో అసహనం మీద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ప్రముఖుల్లో నటి కంగనారౌనత్ కూడా ఉన్నారు. ఇలా వ్యాఖ్యలు చేసిన వీరిద్దరికి ఊహించని రీతిలో ఒక ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ ఇచ్చిన ఒక విందుకు వీరిని ఆహ్వానించారు. మేకిన్ ఇండియా వీక్ వారోత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ ఇచ్చిన ప్రత్యేక విందుకు పలువురు అంతర్జాతీయ.. జాతీయ ప్రముఖుల్ని పిలవటం తెలిసిందే. ఇదే విందుకు తమ సర్కారును ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేసిన అమీర్ ఖాన్.. కంగనారౌనత్ లకు ఆహ్వానం అందటం.. వారు హాజరు కావటం గమనార్హం.
