Begin typing your search above and press return to search.

షాకింగ్ న్యూస్ః అంబానీ నివాసం వ‌ద్ద ఉంచిన‌ బాంబుల వాహ‌నం ఓన‌ర్‌ మృతి.. ఎలా?!

By:  Tupaki Desk   |   5 March 2021 5:30 PM GMT
షాకింగ్ న్యూస్ః అంబానీ నివాసం వ‌ద్ద ఉంచిన‌ బాంబుల వాహ‌నం ఓన‌ర్‌ మృతి.. ఎలా?!
X
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం వ‌ద్ద.. పేలుడు ప‌దార్థాల‌తో కూడిన ఓ వాహ‌నం ఉంచ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆ వాహ‌నాన్ని ఎవ‌రు అక్క‌డ పెట్టారు? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గా.. మ‌రో షాకింగ్ న్యూస్ వెలువ‌డింది. ముఖేష్ ఇంటి వ‌ద్ద నిలిపి ఉంచిన ఆ స్కార్పియో వాహ‌నం ఓన‌ర్ మ‌ర‌ణించాడు.

ముంబై స‌మీపంలోని ఓ చిన్న కాలువ వ‌ద్ద అత‌డి మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. ప్ర‌మాద‌వ‌శాత్తు చ‌నిపోయిన‌ట్లు కేసు న‌మోదు చేశారు.

ఫిబ్ర‌వ‌రి 26న ముఖేష్ నివాసం ‘యాంటిలియా’ ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిలిపి ఉంచారు. ఆ వాహనంలో ఒక బ్యాగును కూడా ఉంచారు. అందులో ఓ లేఖ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఆ లేఖలో ‘ముఖేష్ భయ్యా.. నీతా బాబీ.. ఇదొక ట్రైలర్ మాత్రమే’ అని రాసి ఉంచినట్టు సమాచారం.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ వాహనాన్ని దొంగిలించినట్లుగా దర్యాప్తులో తేల్చారు. తాజాగా.. ఆ వాహనం ఓనర్ మరణించడం తీవ్ర సంచలనం రేపుతోంది.