Begin typing your search above and press return to search.

ప్రాణం ఖతం: నగ్నచిత్రాలు తీసి మహిళకు బ్లాక్ మెయిల్

By:  Tupaki Desk   |   9 Feb 2020 12:09 PM GMT
ప్రాణం ఖతం: నగ్నచిత్రాలు తీసి మహిళకు బ్లాక్ మెయిల్
X
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో దారుణం జరిగింది. ఓ మహిళ నగ్న చిత్రాలను రహస్యంగా తీసిన ఓ ప్రబుద్ధుడు ఆమెకు వాట్సాప్ లో పంపి బెదిరించాడు. 4 లక్షల నగదు, బంగారు నగలు తీసుకున్నాడు. అయినా ఆ బ్లాక్ మెయిలర్ దురాగతం ఆపకుండా వేధించడంతో ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

ఎస్ఆర్ నగర్ కు చెందిన మహిళకు అరుణ్ అనే వ్యక్తితో వివాహమైంది. ఈమెకు రెండేళ్ల పాప కూడా ఉంది. ఈ అత్తగారింట్లో బాత్రూంలో స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ రహస్యంగా ఫొటోలు తీశాడు. ఆమెకు పంపి బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో పరువు పోతుందని భావించి స్వప్న 4 లక్షలు పంపింది. బంగారు నగలు ఇచ్చేసింది. ప్రశాంత్ ఇంకా వేధించడంతో భర్తకు చెప్పి ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ ఫిర్యాదుపై పెద్దగా స్పందించలేదు.

4 లక్షలు ఇవ్వడం.. నగలు ఇచ్చేయడంపై భార్యపై భర్త అరుణ్ కోపడ్డాడు. దీంతో మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త పంచాయితీ పెడతానని చెప్పడంతో ఇంట్లోనే ఉరివేసుకొని ప్రాణం తీసుకుంది.

ఇలా ఓ పచ్చటి సంసారాన్ని ప్రశాంత్ అనే బక్ మెయిలర్ కాలరాశాడు. పోలీసులు స్పందించినా.. భర్త సపోర్టు చేసినా మహిళ బతికిఉండేది.