Begin typing your search above and press return to search.

ఘరానా మొగుడు : రాత్రి మొదటి భార్యతో ..పగలు రెండో భార్యతో...

By:  Tupaki Desk   |   18 July 2020 4:30 PM GMT
ఘరానా మొగుడు : రాత్రి మొదటి భార్యతో ..పగలు రెండో భార్యతో...
X
మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉంటారు అని చెప్తుంటారు. అది అక్షర సత్యం. సమాజంలో ప్రతి రోజు జరిగే సంఘటనలు చూస్తుంటారు ..అయినప్పటికీ అలాంటివారు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోతుంటారు. తాజాగా హైదరాబాద్ లో సినిమా తరహా ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చదువు కోవడం కోసం నగరానికి వచ్చిన ఓ యువతిని అప్పటికే పెళ్లి అయ్యి , కూతరు ఉన్న వ్యక్తి .. ప్రేమ పేరుతో నమ్మించి , పెళ్లి చేసుకొని .. ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం చేసి, గర్భం ధరించిన తరువాత మొదటి భార్యకి ఈ విషయం తెలియడంతో ..రెండో భార్యకి మొఖం చాటేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

మహాంకాళి పోలీసులు, బాధితురాలు తెప్పిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఎస్ కే షబీనా కొన్నేళ్ల క్రితం చదువు కోవడానికి హైదరాబాద్ వచ్చి ఈసీఐఎల్ లో ఉంటూ చదువుకునేది. అదే సమయంలో అక్కడే ఒక స్నేహితురాలి ద్వారా అవుసరి సంపత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ తరువాత కొన్ని రోజులకి ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత సంపత్ మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి .... 2018 , మార్చి 14 న షబీనా ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సంపత్,షబీనాలు ఆవుల మందలో ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టారు. సంపత్ మొదటిభార్య , కూతురు వనస్ధలిపురం లో ఉంటున్నారు. షబీనాను పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే నైట్ డ్యూటీ పేరుతో రాత్రిపూట మొదటి భార్య దగ్గరకు వెల్లి వస్తూ ఉండేవాడు.

ఆలా కొద్దీ రోజులు జరిగిన తరువాత రెండో భార్య షబీనా తో కలిసి సంపత్ మే 31న ఈసీఐఎల్ లో ఉండే స్నేహితుడి ఇంటికి వెళ్లి ,స్నేహితుడితో మళ్లీ పెళ్లి చేసుకున్న విషయాన్ని చెప్పాడు. ఆ తరువాత ఆ ఫ్రెండ్ సంపత్ రెండో పెళ్లి చేసుకొన్నాడు అని మొదటి భార్య కి తెలిపారు. దీంతో ఆమె, తన సోదరుడితో జూన్ 4న సంపత్ ఇంటికి వచ్చి గొడవ పడింది. దీంతో సంపత్ వారి వెంట వెళ్లి పోయాడు.ఆ తర్వాత షబీనా దగ్గరకు రావటం కానీ ఫోన్ చేయటం కానీ చేయలేదు. దీనితో సంపత్ రెండో భార్య మహంకాళి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే భర్త ఒంటరిగా వదలేసి వెళ్లటంతో బాలా నగర్ లో చిన్న గదిలో ఒంటరిగా ఉంటుంది. ఇదే సమయంలో నెలలు నిండటంతో ఇంటి దగ్గర ఉన్న ఒక మహిళ సహాయంతో కోఠి మెటర్నటీ ఆస్పత్రిలో చేరి జులై9న పండంటి బాబుకు జన్మనిచ్చింది.