Begin typing your search above and press return to search.

వీడియో తీయమని ... కొడుకు కళ్లముందే కృష్ణానదిలో దూకి ఆత్మహత్య !

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:34 PM GMT
వీడియో తీయమని ... కొడుకు కళ్లముందే కృష్ణానదిలో దూకి ఆత్మహత్య !
X
విజయవాడలోని కనకదుర్గ బ్రిడ్జ్ పై దారుణ ఘటన చోటుచేసుకుంది. పూజ చేసుకుంటానంటూ బ్రిడ్జీపైకి వచ్చిన ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. తాడిగడపకి చెందిన మన్నే దుర్గాప్రసాద్ బ్రిడ్జీ మీది నుంచి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గాప్రసాద్ సోమవారం తన తమ్ముడి కొడుకు సుజిత్‌ తో కలిసి కనకదుర్గా బ్రిడ్జీ పై కి వచ్చాడు. తన ఫోన్ మరియు కొన్ని పేపర్లను పట్టుకోమని సుజిత్ ‌కి ఇచ్చాడు. తాను చేస్తున్న పూజను వీడియో తీయాలంటూ సుజిత్ ‌ని కోరాడు.

దీనితో దుర్గాప్రసాద్ చేస్తున్న పూజను సుజిత్ వీడియో తీస్తూ ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి దుర్గాప్రసాద్ బ్రిడ్జీ రైలింగ్ ఎక్కి నదిలోకి దూకాడు. ఆ ఘటన అంతా సుజిత్ వీడియో తీస్తున్న ఫోన్‌ లో రికార్డయింది. తన కళ్ల ముందే పెద్దనాన్న నదిలోకి దూకడంతో సుజిత్ షాక్‌ కు గురయ్యాడు. సుజిత్ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. దుర్గాప్రసాద్ కోసం నదిలో గాలిస్తున్నారు. అయితే పోలీసుల సూచన మేరకు.. దుర్గాప్రసాద్ ఇచ్చిన పేపర్లను పరిశీలించగా.. తాను అనారోగ్యంతో చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ లభించింది.