Begin typing your search above and press return to search.

కరోనా నుంచి కోలుకున్న వారికి కీలక సూచన

By:  Tupaki Desk   |   18 July 2021 11:21 AM GMT
కరోనా నుంచి కోలుకున్న వారికి కీలక సూచన
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే జనాలు కోలుకుంటున్నారు. కరోనా మరిన్ని వేరియంట్లుగా దూసుకొస్తోంది. థర్డ్ వేవ్ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు కేంద్రప్రభుత్వం కీలక సూచన చేసింది.

కరోనా బారిన పడి కోలుకున్న వారికి టీబీ సోకుతోందని కేంద్రం తెలిపింది. ఈ తరుణంలోనే దేశంలో క్షయ (టీబీ) కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కేసులు పెరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.

మహమ్మారి బారినపడి కోలుకున్న వారంతా తప్పనిసరిగా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో టీబీ వ్యాధిగ్రస్తులు సైతం కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఈవిషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దృష్టిసారించాలని సూచించింది. ఈ విషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దృష్టి సారించాలని.. టీబీ పరీక్షలు పెంచాలని కోరింది.

కరోనా కారణంగానే కోలుకున్నాక రోగులు టీబీ బారిన పడుతున్నారన్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. టీబీ కేసుల పెరుగుదలకు, కరోనా కారణం అనేదందుకు ఎలాంటి ఆదారాలు లేవంటూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కోవిడ్19 మహమ్మారి.. క్షయ, బ్లాక్ ఫంగస్ వృద్ధి చెందవచ్చని.. ఇది అవకాశం మాత్రమేనంటూ వెల్లడించింది.

కరోనా, క్షయ ఈ రెండు అంటు వ్యాధులు ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తాయని.. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను సృష్టిస్తాయని తెలిపింది. టీబీ, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు ప్రధానంగా బలహీన వ్యక్తులపై దాడి చేస్తాయని.. కరోనా నుంచి కోలుకున్న వారు తమ ఇమ్యూనిటీని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం కీలక సూచనలు చేసింది.