Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య కేసులో నేడు కీలక విచారణ

By:  Tupaki Desk   |   25 Jun 2021 7:30 AM GMT
వైఎస్ వివేకా హత్య కేసులో నేడు కీలక విచారణ
X
వైఎస్ వివేకా హత్య కేసులో ఈరోజు కీలక మలుపు చోటుచేసుకుంది. వరుసగా 19వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 18 రోజులుగా ఈ విచారణలో వైఎస్ వివేకా డ్రైవర్, పీఏ సహా కీలక వ్యక్తుల విచారణను పూర్తి చేశారు.

విచారణలో భాగంగా నిన్న పులివెందులకు చెందిన బాలుతోపాటు పులివెందులలో వివేకా ఇంటిని పరిశీలించింది సీబీఐ బృందం. ప్రస్తుతం కడప జిల్లా సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ , కడప ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ కేంద్రాలుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈరోజు మరికొంత మంది కీలక వ్యక్తులను సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు.

ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ అధికారులు.. ఇవాళ మరిన్ని ఆధారాలు సేకరించే అవకాశాలున్నాయి. దొరికిన ప్రతి ఆధారాన్ని వదలకుండా సీబీఐ అధికారులు శూలశోధన చేస్తున్నారు. కాగా సీబీఐ విచారణ నేపథ్యంలో వైఎస్ వివేకా కూతురు, తమ కుటుంబానికి భద్రత పెంచాలని పోలీసులను కోరారు.

2019 మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ తేలడం లేదు. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వస్తూనే ఉన్నాయి. విచారణ సాగుతున్న కొద్దీ కొత్త కొత్త కోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి.ఒక్కరిని విచారిస్తే మరో కొత్త క్లూ అన్నట్టుగా మరొకరికి లింకు పెడుతూ సీబీఐ విచారణ విస్తృతంగా సాగుతోంది.

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వరుసగా పందోమ్మిదో రోజు కూడా విచారణ జరిపారు. ఇప్పటికే వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరితో పాటు వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్, రవాణాశాఖ సిబ్బందిని విచారించిన సీబీఐ అధికారులు ఈరోజు వైఎస్ వివేకా పీఏను ప్రశ్నించారు.

వివేకా హత్య జరిగే ముందురోజు కొన్ని అనుమానిత వాహనాలు, రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వాహనాలు ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగినట్లు సీబీఐ అధికారులు గుర్తించినట్టు సమాచారం. దీంతో ఆ వాహనాల వివరాలను ట్రాన్స్ పోర్టు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వీరు ఇచ్చిన సమాచారమే ఈకేసులో కీలకంగా మారనుందని సమాచారం.