Begin typing your search above and press return to search.

కరోనా సెంటర్ నుండి మళ్లీ పరారైన జంట !

By:  Tupaki Desk   |   6 Aug 2020 11:30 PM GMT
కరోనా సెంటర్ నుండి మళ్లీ పరారైన జంట !
X
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం కరోనా పై పోరు కొనసాగిస్తుంది, ప్రతి రోజు కూడా వేల సంఖ్యల్లో టెస్టులు చేస్తున్నారు. వాటిల్లో పాజిటివ్ గా తేలితే .. పరిస్థితిని బట్టి క్వారంటైన్ , లేకపొతే హోమ్ ఐసోలేషన్ కి తరలిస్తున్నారు. కరోనా ను కట్టడిలోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమందికి పాజిటివ్ వస్తే ..క్వారంటైన్ సెంటర్ కి తరలిస్తే .. వారు అక్కడ ఉన్న అధికారుల కళ్లు గప్పి క్వారంటైన్ సెంటర్ నుండి పారిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి.

తాజాగా క్వారంటైన్ ‌లో ఉంచిన భార్యభర్తలు రెండోసారి క్వారంటైన్ సెంటర్ నుండి పరారయ్యారు. ఈ ఘటన ఏపీలోని తాడేపల్లిలో జరిగింది. పూర్తి వివరాలు చూస్తే .. పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కాలనీలో నివసించే భార్యాభర్తలను రెండు రోజుల క్రితం అధికారులు గుండిమెడ క్వారంటైన్ ‌లో ఉంచారు. అయితే అక్కడి నుంచి వారు పరారై ఇంటికి వచ్చారు. ఆ విషయం తెలిసిన అధికారులు మళ్లీ వారిని గుంటూరు క్వారంటైన్ సెంటర్‌ కి తరలించారు. క అక్కడి నుంచి కూడా పరారైన వారు కాలనీలోకి వచ్చి రోడ్డు మీద ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. దీన్ని గమనించిన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు ప్రస్తుతానికి ఆ ఇద్దరిని వారి ఇంట్లోనే ఉంచి, బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని మళ్లీ క్వారంటైన్‌ కు తరలిస్తామని మున్సిపల్‌ అధికారులు తెలిపారు.