Begin typing your search above and press return to search.

చేప తిన్నాడు... లివర్ సగం మాయమైంది, ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   25 July 2020 12:30 PM GMT
చేప తిన్నాడు... లివర్ సగం మాయమైంది, ఎక్కడంటే ?
X
ఈ మద్యే ఓ వ్యక్తి ఆకలి, విరేచనాలు, అలసట, కడుపు నొప్పితో హాస్పిటల్‌ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, ఆ రిపోర్టులు చూసి షాకయ్యారు. డాక్టర్స్ ఎందుకు షాక్ అయ్యారు అని అనుకుంటున్నారా ? ఆ వ్యక్తికి కాలేయం సగం మాత్రమే ఉంది. సగం లివర్ ఉండటం చూసిన వైద్యులు షాక్ అయ్యి , ఎందుకలా జరిగిందని మరింత లోతుగా పరిశీలిస్తే.. దాన్ని ఓ పరాన్నజీవి ముక్కలు ముక్కలుగా చేసుకుని తినేస్తూ కనిపించింది. దీంతో వైద్యులు అతడికి వెంటనే చికిత్స మొదలుపెట్టారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే .. పురుగులు , జంతువులు పచ్చిగానే తిని కరోనాకి కారణమైన చైనాలోనే.

చైనా లోని హ్యాంగ్జౌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి గత నాలుగు రోజులుగా విరేచనాలు, అలసట, కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అతడు హస్పిటల్‌ కు వెళ్లి చెకప్ చేయించుకున్నాడు. అతడి కాలేయాన్ని పరిశీలించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. కాలేయం సగం మాయమవ్వడమే కాకుండా అందులో 19 సెంటీ మీటర్ల పొడవు, 18 సెం.మీ. వెడల్పు ఉన్న చీము గడ్డ కనిపించింది. దాని చుట్టు పెద్ద పెద్ద గడ్డలు కూడా ఏర్పడటం మొదలైంది. ఇది పురుగుల వల్ల ఏర్పడినట్లు తెలుసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాలేయాన్ని తొలగించాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు.

అసలు ఏం జరిగిందో వైద్యులకు తెలియచేశాడు. చేపలను ఉడకబెట్టకుండా తింటానని తెలిపాడు. చేపల్లో కంటికి కనిపించని పరాన్నజీవులు ఉంటాయని వీటిని పచ్చిగా తీసుకొనే సమయంలో వాటిలో ఉండే ఈ జీవులు, బ్యాక్టిరీయా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు. పచ్చిగా తిన్నప్పుడు వాటిలో ఉండే పరాన్నజీవులు, బ్యాక్టీరియా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీర అవయవాలను కొరుక్కు తింటూ క్రమేనా అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. బాధితుడి విషయంలో కూడా ఇదే జరిగింది. మరి, ఈ చైనావాళ్లు ఎప్పటికి మారతారో.