Begin typing your search above and press return to search.

బ్యాంకుల్లో ఎన్నారైల సొమ్ము.. ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   24 July 2020 5:30 PM GMT
బ్యాంకుల్లో ఎన్నారైల సొమ్ము.. ఎంతో తెలుసా?
X
డాలర్ల వేటలో పడి విదేశాలకు తరలిపోయిన ఎన్నారైలు తాము సంపాదించిన సొమ్మునంతా నెలనెలా ఇండియాకు పంపిస్తుంటారు. బ్యాంకులకు బదిలీ చేస్తుంటారు. ఇలా పోగుబడిన సొమ్ము లెక్క తెలిస్తే మీరు నోరు వెళ్లబెట్టాల్సిందే.

కేరళలోని బ్యాంకుల్లో ఎన్నారైలు డిపాజిట్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పటివరకు కేవలం ఎన్నారైలు మాత్రమే కేరళలోని వివిధ బ్యాంకుల్లో దాచిపెట్టిన సొమ్ము లెక్క తీయగా.. ఏకంగా రూ.2 లక్షల కోట్లు అని తేలింది.

తాజాగా ప్రకటించిన బ్యాంకుల వివరాల ప్రకారం.. ఎన్నారైల మొత్తం డిపాజిట్లు ఏకంగా 1,99,711.27 కోట్లుగా తేలినట్టు సమాచారం.

ఇలా ఎన్నారైలు ఒక రాష్ట్రంలోని బ్యాంకుల్లో దాచిపెట్టిన సొమ్ము ఏకంగా రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. దేశంలోని అందరికంటే కేరళ వాసులే విదేశాలకు ఎక్కువగా వెళ్లి పనులు చేస్తుంటారు. దాంతో ఆ రాష్ట్రానికి విదేశీ మారకద్రవ్యం బాగా వస్తుంటుంది.