Begin typing your search above and press return to search.

జాకీలతో లేపినా లేవని లోకేశ్ పాదయాత్రకు తెలుగు తమ్ముళ్ల కొత్త స్కెచ్ !

By:  Tupaki Desk   |   2 Jun 2023 11:04 AM GMT
జాకీలతో లేపినా లేవని లోకేశ్ పాదయాత్రకు తెలుగు తమ్ముళ్ల కొత్త స్కెచ్ !
X
వందకు పైగా రోజలు దాటి పోయాయి. అంచనాలకు భిన్నంగా నారా లోకేశ్ పాదయాత్రకు ఆశించినంత మైలేజీ రాని పరిస్థితి. అనుకూల మీడియాలోనూ పాదయాత్రకు ఇస్తున్న ప్రయారిటీ అంతంత మాత్రంగా వస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. పాదయాత్రకు మరింత ప్రచారాన్ని తీసుకొచ్చే అవకాశాల్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వెతుకుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓపక్క ఘాటు విమర్శలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయటంతో పాటు.. జగన్ పాలనపై ఎక్కు పెడుతున్న విమర్శనాస్త్రాలతో పెద్దగా లాభం లేని పరిస్థితి నెలకొంది.

ఇలాంటి వేళ.. ఏదైనా సంచలనంతో అందరి చూపు తమ మీద పడేలా చేయాలన్నది తెలుగు తమ్ముళ్ల ఆలోచనగా చెబుతున్నారు. అందుకు తగ్గట్లే.. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా.. లోకేశ్ పాదయాత్రకు మైలేజీ వచ్చే విషయాల్ని వెతుకుతున్న పరిస్థితి. ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసినా ఫలితం లేని నేపథ్యంలో ఇప్పుడు ట్రాక్ మార్చాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

అందులో భాగంగా వైఎస్ వివేకా హత్య ఉదంతాన్ని టేకప్ చేయాలని డిసైడ్ అయిన తెలుగు తమ్ముళ్లు.. అందుకు తగ్గట్లుగా కొత్త ప్రచారానికి తెర తీశారు. : 'హూ కిల్డ్ బాబాయ్' అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులను లోకేశ్ పాదయాత్రలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో.. వివేకా డెడ్ బాడీతో పాటు.. ముఖ్యమంత్రిని జగన్ ఫోటోతో పాటు.. అవినాశ్ ఫోటోను ఇందులో ప్రింట్ చేశారు.

మొన్నటి వరకు లేనిది ఇప్పుడే వివేకా హత్యకు సంబంధించిన ప్లకార్డులను పట్టుకోవటం.. వాటిల్లో అబ్బాయి బాబాయ్ ను చంపాడు అంటూ ప్రింట్ చేసిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్న వైనం చూస్తే.. ఏదోలా తమ పాదయాత్రకు భారీ మైలేజీ తీసుకురావటమే లక్ష్యమన్నట్లుగా వారి ప్లానింగ్ ఉందన్న మాట వినిపిస్తోంది. సంచలన అంశాలే లోకేశ్ పాదయాత్రకు ప్రాణ వాయువు అన్నట్లుగా పరిస్థితి మారిందన్న మాట వైసీపీ వర్గాల నోటి నుంచి వస్తోంది. సీఎంసొంత జిల్లాలో లోకేశ్ పాదయాత్ర జరుగుతున్న వేళలో.. వివేకా ఫ్లెక్సీలను ప్రదర్శించటం ద్వారా కొత్త ఎత్తుకు తెర తీసినట్లుగా అధికారపక్షం భావిస్తోందిప

తమను కవ్వించటానికే లోకేశ్ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నట్లుగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. లోకేశ్ ఉచ్చులో పడి..ఏ మాత్రం స్పందించినా.. నష్టం తమకే వాటిల్లుతుందని చెబుతున్నారు. లోకేశ్ కవ్వింపులకు రెచ్చిపోతే.. నష్టం తమకే అన్న మాట కొందరు వైసీపీ నేతల నుంచి వినిపించటం గమనార్హం. ఏ చిన్న పొరపాటు జరిగినా.. సానుభూతిని సొంతం చేసుకోవాలన్న లోకేశ్ ఎత్తుగడను .. ధీటుగా ఎలా ఎదుర్కోవాలన్న టాస్క్ వైసీపీ ముందు ఉందన్న మాట వినిపిస్తోంది.

తాము ఎంతలా ప్రయత్నించినా.. పాదయాత్రకు మైలేజీ రాని వేళలో.. వివేకా హత్య ఉదంతాన్ని అసరాగా చేసుకొని అందరి చూపు తన మీద పడేలా చేసుకోవాలన్నదే లోకేశ్ అండ్ కో ఆలోచనగా చెబుతున్నారు. మరి.. దీనికి వైసీపీ వర్గాలు ఎలా రియాక్టు అవుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.