Begin typing your search above and press return to search.
మేం అధికారంలో ఉన్నామా? లేదా? అన్న అనుమానంగా ఉంది: సజ్జల నైరాశ్య
By: Tupaki Desk | 20 March 2023 9:37 AMమొత్తం 9 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే.. ఆరు స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. కేవలం మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అది గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. ఆరు స్థానాల్లో అక్రమాల గురించి మాట్లాడని వైసీపీ నాయకులు.. ఈ మూడు స్థానాల్లో మాత్రం అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. అదేసయమంలో వారి నోటి నుంచి తీవ్ర నిర్వేదంతోకూడిన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు మేం అధికారంలో ఉన్నామా? లేదా? అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఎందుకు వచ్చిందో పరిశీలించుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు.. పశ్చిమ ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. కౌంటింగ్ లో పాల్గొన్న అధికారుల తీరుపైనా అనుమానాలు ఉన్నాయని.. ఒక్కోసారి వైసీపీ అధికారంలో ఉందా లేదా..! అన్న ఆలోచన వస్తోందని సజ్జల పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైసీపీ తన హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు.
అర్జెంటుగా అధికారం చేపట్టాలన్న తీరులో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని.. ఆయనకు కలలు మాత్రమే మిగులుతాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిదని, వ్యవస్థలో ఎక్కడైనా మేనేజ్ చేసే అవకాశం ఉంటుందనే అనుమానంతో ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
గతంలో ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వానికి ఓ సేనాధిపతిలా వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటుకు సాంకేతికంగా టీడీపీకి బలం ఉందని, అయితే ఆ పార్టీ నుంచి కొందరు బయటకు వచ్చారని అన్నారు. ఆ పార్టీ ఏదైనా ప్రలోభాలకు పాల్పడే అవకాశాలున్నాయని సజ్జల వ్యాఖ్యానించారు.
''టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మరోసారి పరిశీలించాలని మేం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరాం. కానీ, ఫలితాలు వెల్లడించిన తర్వాతనే అవకాశం ఉంటుందని చెప్పడంతో మళ్లీ లెటర్ పెట్టాం. నిబంధనల ప్రకారం మేం పూర్తిగా రీకౌంటింగ్ కోరే అవకాశాలున్నాయి. కానీ, అలా కాకుండా గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లను, వాటిని వేరు చేస్తూ చేసిన కట్టలను మళ్లీ పరిశీలించాలని కోరుతున్నాం. ఇది మా హక్కు. అడిగే హక్కు ఉందని చట్టం చెప్తుంది. దాని ప్రకారమే అడుగుతున్నాం'' అని సజ్జల వ్యాఖ్యానించారు.
టీడీపీపై అదే వరుస
ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై సజ్జల మరోసారి పసలేని విమర్శలు సంధించారు. ''గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో టీడీపీకి చెందిన ప్రముఖ నాయకులు ఏజెంట్ల స్థానంలో వచ్చి కూర్చోవడాన్ని ఎలా భావించాలి. అధికారులను దబాయించే నాయకులను అక్కడ ఉంచారు. లిఖిత పూర్వకంగా కాకుండా ఓరల్ గా అడిగినా మళ్లీ లెక్కించాల్సి ఉంది. అయినప్పటికీ మా విన్నపాన్ని రిటర్నింగ్ అధికారి పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను పోటీచేయించగలదా'' అని ప్రశ్నించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఎందుకు వచ్చిందో పరిశీలించుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు.. పశ్చిమ ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. కౌంటింగ్ లో పాల్గొన్న అధికారుల తీరుపైనా అనుమానాలు ఉన్నాయని.. ఒక్కోసారి వైసీపీ అధికారంలో ఉందా లేదా..! అన్న ఆలోచన వస్తోందని సజ్జల పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైసీపీ తన హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు.
అర్జెంటుగా అధికారం చేపట్టాలన్న తీరులో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని.. ఆయనకు కలలు మాత్రమే మిగులుతాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిదని, వ్యవస్థలో ఎక్కడైనా మేనేజ్ చేసే అవకాశం ఉంటుందనే అనుమానంతో ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
గతంలో ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వానికి ఓ సేనాధిపతిలా వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటుకు సాంకేతికంగా టీడీపీకి బలం ఉందని, అయితే ఆ పార్టీ నుంచి కొందరు బయటకు వచ్చారని అన్నారు. ఆ పార్టీ ఏదైనా ప్రలోభాలకు పాల్పడే అవకాశాలున్నాయని సజ్జల వ్యాఖ్యానించారు.
''టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మరోసారి పరిశీలించాలని మేం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరాం. కానీ, ఫలితాలు వెల్లడించిన తర్వాతనే అవకాశం ఉంటుందని చెప్పడంతో మళ్లీ లెటర్ పెట్టాం. నిబంధనల ప్రకారం మేం పూర్తిగా రీకౌంటింగ్ కోరే అవకాశాలున్నాయి. కానీ, అలా కాకుండా గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లను, వాటిని వేరు చేస్తూ చేసిన కట్టలను మళ్లీ పరిశీలించాలని కోరుతున్నాం. ఇది మా హక్కు. అడిగే హక్కు ఉందని చట్టం చెప్తుంది. దాని ప్రకారమే అడుగుతున్నాం'' అని సజ్జల వ్యాఖ్యానించారు.
టీడీపీపై అదే వరుస
ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై సజ్జల మరోసారి పసలేని విమర్శలు సంధించారు. ''గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో టీడీపీకి చెందిన ప్రముఖ నాయకులు ఏజెంట్ల స్థానంలో వచ్చి కూర్చోవడాన్ని ఎలా భావించాలి. అధికారులను దబాయించే నాయకులను అక్కడ ఉంచారు. లిఖిత పూర్వకంగా కాకుండా ఓరల్ గా అడిగినా మళ్లీ లెక్కించాల్సి ఉంది. అయినప్పటికీ మా విన్నపాన్ని రిటర్నింగ్ అధికారి పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను పోటీచేయించగలదా'' అని ప్రశ్నించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.