Begin typing your search above and press return to search.

బీర్‌ కంపెనీలపై 873 కోట్ల జరిమానా.. ఎందుకంటే

By:  Tupaki Desk   |   25 Sep 2021 10:30 AM GMT
బీర్‌ కంపెనీలపై 873 కోట్ల జరిమానా.. ఎందుకంటే
X
మార్కెట్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ధరల నియంత్రణ, నిర్ణయాల్లో కుమ్మక్కయ్యారంటూ బీర్ల కంపెనీల పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) శుక్రవారం తమ ప్రతాపం చూపించింది. రూ.873కోట్ల రూపాయలను యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్‌బర్గ్ ఇండియా, ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్ లతో పాటు మరికొన్నింటికి ఇది వర్తిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ సేల్, సప్లై విషయంలో ఫైన్ విధిస్తూ కీలక నిర్ణయం వెల్లడించింది.

ఇన్వెస్టిగేషన్ తర్వాత యునైటెడ్ బ్రూయరీస్ లిమిటెడ్, సబ్‌ మైలర్ ఇండియా లిమిటెడ్, కార్ల్స్‌బెర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లైన మూడు కంపెనీలకు ఫైన్ విధించింది. కాంపిటీషన్ లాను అతిక్రమించారని పేర్కొంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టేట్మెంట్ లో వెల్లడించింది. పెనాల్టీని తగ్గిస్తూ.. బెనిఫిట్ ఇచ్చామని చెప్పింది. సబ్ మైలర్ ఇండియా లిమిటెడ్ కు 100శాతం, యూబీఎల్ కు 40శాతం, సీఐపీఎల్ కు 20శాతం తగ్గింపు ఇస్తున్నట్లు చెప్పింది.

యూబీఎల్, కార్ల్స్‌ బర్గ్ ఇండియాల జరిమానాల మొత్తం రూ.752కోట్లు, రూ.121కోట్లుగా ఉండనుంది. సబ్ మైలర్స్ ఇండియా లిమిటెడ్ కు రూ.6.25లక్షలు జరిమానాగా విధించారు. సీజ్ చేయకుండా జరిమానా మాత్రమే విధించామని అధికారులు చెప్తున్నారు. ఏపీసహా పలు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు, సరఫరాల్లో కూటమిగా ఏర్పడి మార్కెట్‌ స్వేచ్ఛను దెబ్బతీశారంటూ సీసీఐ ఈ ఫైన్‌ వేసింది. దాదాపు నాలుగేండ్ల సమగ్ర దర్యాప్తు అనంతరం సీసీఐ ఈ ఆదేశాలు జారీ చేయగా, యూబీఎల్‌పై రూ.752 కోట్లు, కార్ల్స్‌ బర్గ్‌ పై రూ.121 కోట్లు జరిమానా పడింది. ఏఐబీఏ, మరికొందరిపై రూ.6.25 లక్షలు ఫైన్‌ వేసింది.