Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో 2 కొత్త జట్లు ... భారత్ - పాక్ మ్యాచ్ జరగగానే ప్రకటన !

By:  Tupaki Desk   |   29 Sep 2021 12:30 PM GMT
ఐపీఎల్ లో 2 కొత్త జట్లు ... భారత్ - పాక్ మ్యాచ్ జరగగానే ప్రకటన !
X
ఐపీఎల్ ..ఇండియన్ ప్రీమియర్ లీగ్ .. అభిమానులకు త్వరలో బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఐపీఎల్ 2021 ముగిసిన మరుసటి రోజే టీ20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24 న భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ తరువాతి రోజే ఐపీఎల్ 2022 లో అడుగుపెట్టనున్న మరో రెండు కొత్త జట్లను బి సిసిఐ ప్రకటించనుంది. రెండు వేల కోట్ల బేస్ ప్రైస్ తో పాటు 10 లక్షల రూపాయల నాన్ రిఫండేబుల్ డిపాజిట్ తో బిడ్ జరగనుంది. ఇప్పటికే ధర్మశాల, కటక్, గౌహతి, అహ్మదాబాద్, రాంచీ, లక్నో వంటి నగరాలు ఐపీఎల్ ఫ్రాంచేజి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 10న ఫ్రాంచేజి కోసం దరఖాస్తుల గడువు ముగియనుంది. అంతేకాకుండా 2023 నుండి 2027 వరకు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ ప్రసార హక్కులకు సంబంధించిన ప్రకటన కూడా బిసిసిఐ చేయనుంది.

ఇప్పటికే షార్ట్ లిస్టు అయిన ఆ ఆరు నగరాల్లో గౌహతి, లక్నో, అహ్మదాబాద్ లకు ఫ్రాంచేజి దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఐపీఎల్‌ లో ఎంట్రీ కావాల్సింది రెండు జట్లే కావడం వల్ల పోటీ తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఐపీఎల్‌ లో ఇప్పటికే ఎనిమిది జట్లు కొనసాగుతున్నాయి. ఈ సంఖ్య పెరగబోతోంది. 10కి చేరుతుంది. దీనితో పాటు ఐపీఎల్ మ్యాచ్‌ ల సంఖ్య కూడా పెరుగుతుంది. సుదీర్ఘమైన షెడ్యూల్ ఉంటుంది ఇకమీదట. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌ కత నైట్ రైడర్స్ జట్లకు తోడుగా మరో రెండు కొత్త టీమ్స్ రానున్నాయి.

ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ధృవీకరించింది. అక్టోబర్ 25వ తేదీన రెండు కొత్త ఐపీఎల్ జట్ల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే .. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టైటిల్ విజేతగా నిలవడం , బెంగుళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు ఒక్కసారి కూడా టైటిల్ ని గెలవకపోవడంతో రానున్న జట్ల ప్రదర్శన ఎలా ఉండబోతుందో, ఇప్పటికే బిసిసిఐ నియమాల ప్రకారం ఒక టీంలో నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం కల్పించడంతో మిగిలిన కీలక ఆటగాళ్ళను కూడా జట్లు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న జట్లలో నలుగురు మినహా కొత్త ఆటగాళ్ళే వస్తారా లేదా ఇప్పటివరకు ఉన్న ఆటగాళ్ళనే జట్టు యాజమాన్యం భారీ మొత్తం చెల్లించి తిరిగి జట్టులోకి తీసుకుంటారో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే .