Begin typing your search above and press return to search.

వీడియో: మాల్దీవుల్లో ఒంట‌రిగానే ఉన్నాన‌ని క‌ల‌రింగా?

అందాల నటి తమన్నా భాటియా ఇటీవల జైలర్- భోలా శంకర్ చిత్రాల విడుదల తర్వాత కొంత విరామం కోరుకుంది.

By:  Tupaki Desk   |   3 Sep 2023 9:06 AM GMT
వీడియో: మాల్దీవుల్లో ఒంట‌రిగానే ఉన్నాన‌ని క‌ల‌రింగా?
X

అందాల నటి తమన్నా భాటియా ఇటీవల జైలర్- భోలా శంకర్ చిత్రాల విడుదల తర్వాత కొంత విరామం కోరుకుంది. వెకేష‌న్ ను ఆస్వాధించడానికి మాల్దీవులలోని సోనేవా ఫుషికి వెళ్ళింది. త‌న ప్రియుడు విజయ్ వర్మతో కొంత విలువైన సమయం గ‌డిపి రోజువారీ ఒత్తిళ్ల‌ నుండి ఉపశమనం పొందింది. వీరిద్దరూ గురువారం ముంబైకి తిరిగి వచ్చారు. విమానాశ్రయంలో విడివిడిగా ఫోటోగ్రాఫ‌ర్ల కంట ప‌డ్డారు. తిరిగి వచ్చిన తర్వాత తమన్నా ఒక అరుదైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

వీడియోలో తమన్నా రిసార్ట్ ప‌రిస‌రాల్లో అల్లర‌ల్ల‌రిగా క‌నిపించింది. ఐస్‌క్రీమ్‌ను ఆస్వాధిస్తూ.. అద్భుతమైన ఎరుపు రంగు బికినీలో బీచ్‌లో నడుస్తూ క‌నిపించింది. ఉష్ణమండల తీరంలో ఎండలో కాగుతూ క‌నిపించింది. కాసేపు బద్ధకంగాను క‌నిపించింది. గులాబీ బికినీలో ఇంద్రధనస్సును వెంబడిస్తూ సముద్రం వైపు పరుగెత్తుతూ ఆ అల్ల‌రికి హ‌ద్దు అన్న‌దే లేదు.

నిజానికి త‌మ‌న్నా మాల్దీవులకు వెళ్ల‌డం ఇదే మొద‌టి సారి కాదు. కానీ ఈసారి త‌న‌తో పాటే ఒక స్పెష‌ల్ మ్యాన్ ఉన్నాడు. అత‌డే జీవితంగా గ‌డుపుతోంది కాబ‌ట్టి ఇది క‌చ్ఛితంగా స్పెష‌ల్ వెకేష‌న్. త‌న జీవితంలో మ‌ర్చిపోలేని అంద‌మ‌న రొమాంటిక్ యాత్ర అని చెప్పాలి. వెకేష‌న్ నుండి కొన్ని ఫోటోలను త‌మ‌న్నా ఇప్ప‌టికే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోల వెన‌క స్టోరీని ప‌రిశీలిస్తే...మొదటి ఫోటోలో తమన్నా భాటియా పింక్ బికినీలో బీచ్ లో, ఆర్చింగ్ రెయిన్‌బో కింద పోజులిచ్చింది. రెండవ ఫోటోగ్రాఫ్ లో ఇసుకపై ఏదో గీస్తూ కనిపించింది. కొన్ని ఇతర ఫోటోలలో ఊయలలో విశ్రాంతి తీసుకుంటూ, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ, తలపై పెద్ద జనపనార టోపీతో పోజులిస్తూ ర‌క‌ర‌కాలుగా క‌నిపించింది. ఈ యాత్ర ఆద్యంతం త‌మ‌న్నా ఎంతో గొప్ప‌గా ఆస్వాధించింద‌ని ఈ ఫోటోలు చెబుతున్నాయి.

యాత్ర ముగిసింది కాబ‌ట్టి త‌మ‌న్నా త‌దుప‌రి కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించ‌నుంది. డే-ఆఖ్రీ సచ్ లో త‌మ‌న్నా న‌ట‌న‌కు పేరొచ్చింది. ఈ సిరీస్ ఇటీవ‌లే విడుద‌లై ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకుంది. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో జరిగిన విషాదం నేప‌థ్యంలో చిత్ర‌మిది. అనేక ఆత్మహత్యలకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన క‌థాంశంతో ఇది రూపొందింది. ఆగస్టు 25న డిస్నీ+ హాట్‌స్టార్ లో ప్రీమియర్ అయింది. జైలర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో రజనీకాంత్ స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టించింది. భోళా శంకర్‌లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి కనిపించింది. విజయ్ వర్మ తదుపరి సుజోయ్ ఘోష్ - జానే జాన్‌లో నటించనున్నారు. అతడు చివరిగా ప్రైమ్ వీడియో సిరీస్ -దహాద్ .. సస్పెన్స్-క్రైమ్ డ్రామా కాల్‌కూట్‌లో కనిపించాడు.