Begin typing your search above and press return to search.
రూమర్ లకు చెక్ పెట్టిన సూర్య
By: Tupaki Desk | 27 May 2022 2:30 AM GMTవిభిన్న చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు హీరో సూర్య. ఇటీవలే పాండిరాజ్ డైరెక్షన్ లో చేసిన `ఎంతార్కుమ్ తున్నిదవన్` ఆశించిన ఫలితాన్ని అందించిన లేకపోయింది. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లని సొంతం చేసుకున్న సూర్య కు `ఎంతార్కుమ్ తున్నిదవన్` తో బిగ్ షాక్ తగిలింది. అయినా సరే మరోసారి ప్రయోగం వైపే అడుగులు వేశాడు. ఆయన ప్రస్తుతం 41వ సినిమా చేస్తున్నారు.
బాల దర్శకత్వంలో ఈ మూవీని చేస్తున్నారు. నందా, పితామగన్, మాయావి వంటి చిత్రాల్లో నటించిన సూర్య దాదాపు 17 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత బాలతో ఈ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ అర్థాంతరంగా ఆగిపోయిందంటూ గత కొన్ని రోజులుగా రూమర్ లు వినిపించడం మొదలైంది.
తాజాగా ఈ రూమర్ లకు చెక్ పెడుతూ హీరో సూర్య గురువారం సెట్ లో తనకు దర్శకుడు బాల సన్నివేశాన్ని వివరిస్తున్న ఓ బీటీఎస్ ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సెట్ లోకి రావడానికి ఎదురుచూస్తున్నాను` అంటూ తను షేర్ చేసిన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. కూమర్ లని పెద్దగా ఆసక్తి చూపించని హీరో సూర్య తొలిసారి తను బాలతో కలిసి చాలా ఏళ్ల తరువాత చేస్తున్న సినిమాపై వస్తున్న రూమర్ లకు చెక్ పెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుని సెట్స్ పైకి వెళ్లే క్రమంలో హీరో సూర్యకు - బాలకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ మొదలయ్యాయని, అవి చివరికి పతాక స్థాయికి చేరడంతో బాలతో చేస్తున్న సినిమాని సూర్య అర్థాంతరంగా నిలిపివేశాడంటూ ప్రచారం మొదలైంది. అయితే ఆ రూమర్ లకు తాజాగా హీరో సూర్య గట్టి కౌంటర్ ఇవ్వడమే కాకుండా తన సినిమా ఆగిపోలేదని, బాలతో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నానని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.
ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని ఇటీవలే కన్యాకుమారిలో పూర్తి చేశారు. 35 రోజుల పాటు అక్కడే కీలక ఘట్టాలని చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ జూన్ లో గోవాలో జరగబోతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్ లో 15 రోజుల పాటు కీటక ఘట్టాలని చిత్రీకరిస్తారట.
https://twitter.com/Suriya_offl/status/1529742532791238657?cxt=HHwWgoCgjdGu3roqAAAA
బాల దర్శకత్వంలో ఈ మూవీని చేస్తున్నారు. నందా, పితామగన్, మాయావి వంటి చిత్రాల్లో నటించిన సూర్య దాదాపు 17 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత బాలతో ఈ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ అర్థాంతరంగా ఆగిపోయిందంటూ గత కొన్ని రోజులుగా రూమర్ లు వినిపించడం మొదలైంది.
తాజాగా ఈ రూమర్ లకు చెక్ పెడుతూ హీరో సూర్య గురువారం సెట్ లో తనకు దర్శకుడు బాల సన్నివేశాన్ని వివరిస్తున్న ఓ బీటీఎస్ ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సెట్ లోకి రావడానికి ఎదురుచూస్తున్నాను` అంటూ తను షేర్ చేసిన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. కూమర్ లని పెద్దగా ఆసక్తి చూపించని హీరో సూర్య తొలిసారి తను బాలతో కలిసి చాలా ఏళ్ల తరువాత చేస్తున్న సినిమాపై వస్తున్న రూమర్ లకు చెక్ పెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుని సెట్స్ పైకి వెళ్లే క్రమంలో హీరో సూర్యకు - బాలకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ మొదలయ్యాయని, అవి చివరికి పతాక స్థాయికి చేరడంతో బాలతో చేస్తున్న సినిమాని సూర్య అర్థాంతరంగా నిలిపివేశాడంటూ ప్రచారం మొదలైంది. అయితే ఆ రూమర్ లకు తాజాగా హీరో సూర్య గట్టి కౌంటర్ ఇవ్వడమే కాకుండా తన సినిమా ఆగిపోలేదని, బాలతో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నానని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.
ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని ఇటీవలే కన్యాకుమారిలో పూర్తి చేశారు. 35 రోజుల పాటు అక్కడే కీలక ఘట్టాలని చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ జూన్ లో గోవాలో జరగబోతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్ లో 15 రోజుల పాటు కీటక ఘట్టాలని చిత్రీకరిస్తారట.
https://twitter.com/Suriya_offl/status/1529742532791238657?cxt=HHwWgoCgjdGu3roqAAAA