Begin typing your search above and press return to search.

ఏలూరులో ఆమె చేసిన పని తెలిస్తే కోపంతో రగిలిపోవాల్సిందే

అమ్మతనానికి మాయని మచ్చలా మారే ఉదంతాలు

By:  Tupaki Desk   |   14 July 2023 5:16 AM GMT
ఏలూరులో ఆమె చేసిన పని తెలిస్తే కోపంతో రగిలిపోవాల్సిందే
X

అమ్మతనానికి మాయని మచ్చలా మారే ఉదంతాలు ఈ మధ్యన బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఉదంతాలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో.. అత్యంత అమానవీయంగా ఉన్న ఈ ఉదంతం గురించి విన్నంతనే ఒళ్లు జలదరించటమే కాదు.. ఆమెను అమ్మ అన్న మాట అన్నా.. పాపం తగులుతుందన్న భావన కలుగుతుంది. ఏలూరులో వెలుగు చూసిన ఈ వైనం షాకింగ్ గా మారింది. దిశ పోలీసులకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో విచారణ చేసిన పోలీసులు సైతం విస్మయానికి గురవుతున్నారు. ఇద్దరు పిల్లల తల్లి ఇలా చేస్తుందా? అని షాక్ కు గురవుతున్నారు.

ఒక మహిళకు భర్త.. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె కుటుంబ నియంత్రణ సర్జరీ చేయించుకుంది. అయితే.. 2007లో ఆమె భర్త అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత మేనత్త కొడుకును రెండో పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని అతడు ఆమెను కోరేవాడు. ఆమెకున్న పరిమితి కారణంగా.. ఆమెను కాకుండా మరొకరిని పిల్లల కోసం పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడు.

దీంతో.. ఆమె దారుణమైన ప్రతిపాదన చేసింది. తన ఇద్దరు ఆడ పిల్లల్లో యుక్త వయసు వచ్చిన మొదటి కూతురితో పిల్లల్ని కనాలని కోరింది. అందుకు భర్తను ఒప్పించింది. 17 ఏళ్ల పెద్ద కుమార్తెను అతడికి అప్పగించింది.

ఆమెకు ఆడపిల్ల జన్మించింది. తర్వాత మగ పిల్లాడు కావాలన్న అతడి మాటకు.. తన రెండో కుమార్తెను అతడికి అప్పజెప్పింది. అయితే.. ఆమెకు ఏడాది క్రితం మగ శిశువు పుట్టి చనిపోయాడు. దీంతో దాన్ని కాలువలో పడేశారు.

ఇటీవల భర్తతో విభేదాలు రావటంతో.. ఆమె అతడ్ని.. తన పిల్లల్నివదిలేసి విశాఖపట్నంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్న కుమార్తెకు తెలిసిన స్నేహితుడితో తమ ఇంట్లో జరుగుతున్న ఆరాచకం గురించి చెప్పి.. భోరుమంది. దీంతో.. ఆ స్నేహితుడు పిల్లల మేనమామకు విషయాల్ని చెప్పటంతో.. ఆ వెంటనే ఆయన దిశ పోలీసుల్ని సంప్రదించారు.

వారు రంగంలోకి దిగటంతో విషయం బయటకు వచ్చింది. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం విన్న వారంతా షాక్ కు గురవుతున్నారు. అసలు ఆమె అమ్మేనా? అంటూ తిట్టిపోస్తున్నారు.