Begin typing your search above and press return to search.

అమెరికాలో వైఎస్ విజయమ్మ... పిక్ వైరల్

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 April 2024 9:07 AM GMT
అమెరికాలో వైఎస్ విజయమ్మ... పిక్ వైరల్
X

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా... వైఎస్ షర్మిళ పీసీసీ చీఫ్ అయిన తర్వాత.. తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆ డోసు మరింత పెరిగిన పరిస్థితి.

ప్రధానంగా కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి లక్ష్యంగా షర్మిళ కురిపిస్తున్న విమర్శలు పీక్స్ కి చేరాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అవినాష్ కి ఎంపీ టిక్కెట్ ఇచ్చారంటూ జగన్ పైనా ఆమె తీవ్రస్థాయిలో ఫైరవుతున్నాయి. ప్రధానంగా వివేకా హత్యకేసును ప్రస్థావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ టాపిక్ ఎత్తొద్దని కోర్టు తెలిపింది!

ఏది ఏమైనా... ఏపీలో అన్నపై షర్మిళ చేస్తున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రత్యేకంగా కడప కేంద్రంగా జగన్ ని ఆమె తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. కడపలో అవినాష్ ని, పులివెందులలో జగన్ ని ఓడించాలనే స్థాయిలో ఆమె బలంగా ప్రచారం చేస్తున్నారు.. కొంగు చాపి మరీ ఓట్లు అడుతున్నారు! ఈ సమయంలో వీరిద్దరి తల్లి విజయమ్మ మాత్రం ఏపీకి దూరంగా వెళ్లిపోయారు!

అవును... ఏపీలో ఎన్నికల వేళ అనూహ్యంగా అన్నా చెల్లెల్లిద్దరూ హోరా హోరీగా తలపడుతున్న వేళ వీరి తల్లి విజయమ్మ మద్దతు ఎవరికి అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... ఆమె బ్లెస్సింగ్స్ ఇద్దరికీ ఉంటాయనే కొన్ని సంఘటనలు జరిగాయి.. మరికొన్ని ఫోటోలు తెరపైకి వచ్చాయి. దీంతో.. కారణం ఏమైనా ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు! దీనికి సంబంధించిన ఫోటో తెరపైకి వచ్చింది.

ఈ ఫోటోలో నూతన దంపతులు వైఎస్ రాజారెడ్డి - ప్రియా లతో పాటు.. వైఎస్ షర్మిళ కుమార్తె అంజలితో కలిసి వైఎస్ విజయమ్మ ఉన్నారు. దీంతో.. ఆమె ప్రస్తుతం ఈ రాజకీయాలకు దూరంగా మనవడు, మనవరాళ్లతో అమెరికాలో ప్రశాంతంగా గడుపుతున్నారనే కామెంట్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి!

కాగా... ఇటీవల విజయమ్మ బర్త్ డే జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అన్నా చెల్లెల్లు.. వైఎస్ జగన్, షర్మిళ ఇద్దరూ ఆన్ లైన్ వేదికగా తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.