Begin typing your search above and press return to search.

పొత్తు ప్రకటనపై వైసీపీ... వన్ వర్డ్ రియాక్షన్ వైరల్!

ఇందులో భాగంగా... ఈ పొత్తు అంశాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆన్ లైన్ వేదికగా అధికారికంగా ప్రకటించిన అనంతరం ఆ ట్వీట్ ను ఉటంకిస్తూ... "సిద్ధం" అని రాసింది వైసీపీ.

By:  Tupaki Desk   |   10 March 2024 5:53 AM GMT
పొత్తు ప్రకటనపై వైసీపీ... వన్  వర్డ్  రియాక్షన్  వైరల్!
X

1999 నుంచి పలు దఫాలుగా బీజేపీతో పెట్టుకున్న పొత్తును మరోసారి ఏర్పాటు చేసుకుంది టీడీపీ. 1999, 2004, 2014 సిరీస్ ని కంటిన్యూ చేస్తూ 2024లో మరోసారి టీడీపీ - బీజేపీ కలిసి పోటీచేయబోతున్నాయి. ఇప్పటికే పొత్తుపై క్లారిటీ రావడంతోపాటు.. సీట్ల ప్రతిపాదనపైనా ఇరుపార్టీల మధ్యా ఒక క్లారిటీ వచ్చిందని అంటున్నారు.

ఇక ఈ పొత్తు 2014 తరహాలోనే విక్టరీ సాధించి తీరుతుందని చంద్రబాబు నమ్మకంగా ఉండగా... 2004 నాటి సంగతులను గుర్తుచేస్తున్నారు వైసీపీ జనాలు. ఈ పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని టీడీపీ అంటుంటే... 2014లో చేసినట్లేనా అని సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేటిజన్లు. ఆ సంగతి అలా ఉంటే... ఈ పొత్తుపై వైసీపీ అధికారికంగా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... 2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన గెలిచిన తర్వాత నాలుగేళ్లకే ఆ పొత్తులోని వారంతా బద్దశత్రువులుగా మారిపోయారు. అనంతరం 2019లో ఎవరికి వారే పోటీ చేశారు. ఈ క్రమంలో దశాబ్ధం తర్వాత 2024లో మరోసారి టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి పోటీచేస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ సమయంలో ఈ పొత్తు ప్రకటనపై వైసీపీ అధికారికంగా సింగిల్ వర్డ్ తో రియాక్షన్ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఈ పొత్తు అంశాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆన్ లైన్ వేదికగా అధికారికంగా ప్రకటించిన అనంతరం ఆ ట్వీట్ ను ఉటంకిస్తూ... "సిద్ధం" అని రాసింది వైసీపీ. దీంతో... మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్... ఇక యుద్ధమే అందుకు తాము సిద్ధమే అన్నట్లుగా వైసీపీ స్పందించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.