ఒకేసారి ముప్పేట దాడి.. జగన్కు ఇబ్బందేనా ..!
వైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉన్నారు. కానీ, ఆయన చుట్టూ ముప్పేట దాడి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 19 April 2025 6:30 PMవైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉన్నారు. కానీ, ఆయన చుట్టూ ముప్పేట దాడి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తమకు సాయం చేయడం లేదని.. కనీసం తమను పట్టించుకోవడం లేదని మెజారిటీ నాయకులు.. ముఖ్యంగా కేసుల్లో ఇరుక్కున్న వారు.. బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ.. తప్పించుకుని తిరుగుతున్న వారు అడ్డం తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. ఇదే జరిగితే.. జగన్ మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం .. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయనకు న్యాయపరమైన సాయం అందించేందుకు వైసీపీ ముందుకు రావడం లేదన్న చర్చ ఉంది. అదేవిధంగా ఆయన తప్పిం చుకుని తిరుగుతున్న క్రమంలో ఆయన సమాచారాన్ని కూడా.. వైసీపీలోని కొందరు నాయకులు లీక్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాకాణి కనుక రేపు బయటకు వచ్చి.. జగన్ కు పూర్తిగా యాంటీగా మారితే ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
ఇక, కీలకమైన మరో వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి. ఆయన కూడా.. తప్పించుకుని తిరుగుతున్నారు. వైసీపీ హయాంలో రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈయన తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా తీవ్రంగానే గాలిస్తున్నారు. మరోవైపు.. కసిరెడ్డి విషయాన్ని కూ డా.. జగన్ లైట్ తీసుకున్నారు. వీరంతా.. కీలకమైన నాయకులు.. పైగా.. జగన్కు అత్యంత సన్నిహితులు గా ముద్ర వేసుకున్నవారే.
ఇలాంటివారి విషయాన్నే వైసీపీ పట్టించుకోకపోతే.. రేపు వారంతా యాంటీ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మరిన్ని లోగుట్లు బయటకు వస్తే.. జగన్కు ముప్పేట దాడి తప్పదని అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రె స్లోనూ కొందరు నాయకులను పార్టీ పట్టించుకోలేదన్న కారణంగా.. బయటకు వచ్చి అప్రూవర్లుగా మారారు. ఫలితంగా పెద్ద పెద్ద నేతల చుట్టూ సమస్యలు చుట్టుకున్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.