Begin typing your search above and press return to search.

టోటల్ ఎంపీలు చేంజ్... జగన్ వ్యూహం ఏంటి....!?

దాని కోసం పెద్ద ఎత్తున మార్పు చేర్పులు చేస్తోంది. ఈసారి టోటల్ గా ఎంపీలను చేంజ్ చేసేందుకు వైసీపీ నిర్ణయం తీసుకుంది

By:  Tupaki Desk   |   10 Jan 2024 4:39 PM GMT
టోటల్ ఎంపీలు చేంజ్... జగన్ వ్యూహం ఏంటి....!?
X

ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మొత్తం 22 మంది ఎంపీలు గెలిచారు. 25 ఎంపీ సీట్లు ఉంటే మూడంటే మూడు తప్ప మిగిలిన వాటిని వైసీపీ సొంతం చేసుకుని హిస్టారికల్ విక్టరీని నమోదు చేసింది. ఇంత పెద్ద నంబర్ తో ఎంపీ సీట్లు గెలుచుకున్నందువల్లనే వైసీపీకి కేంద్రం వద్ద మంచి పలుకుబడిని సంపాదించింది.

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి విలువ గౌరవం ఇస్తోంది అంటే వైసీపీకి ఉన్న అతి పెద్ద ఎంపీల నంబరే కారణం అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఏపీలో 22 మంది ఎంపీలు వైసీపీకి ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా అదే నంబర్ ని గెలవాలని వైసీపీ డెసిషన్ తీసుకుంది.

దాని కోసం పెద్ద ఎత్తున మార్పు చేర్పులు చేస్తోంది. ఈసారి టోటల్ గా ఎంపీలను చేంజ్ చేసేందుకు వైసీపీ నిర్ణయం తీసుకుంది. వన్ అండ్ ఓన్లీగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఉంటారు తప్ప మిగిలిన వారు అంతా మారిపోతారు అనే అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా సాగుతోంది. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. అక్కడ కొత్తవారు వస్తున్నారు. అలాగే హిందూపురం నుంచి కర్నాటక బీజేపీ మాజీ ఎంపీ జె శాంతమ్మకు టికెట్ ఇస్తున్నారు. గోరంట్ల మాధవ్ కి నో చెప్పేశారు.

కడప నుంచి చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డికి నో చెప్పి జమ్మలమడుగు నుంచి పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఎంపీగా మైనారిటీ వర్గానికి చెందిన నేతకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ప్లేస్ లో మంత్రి గుమ్మలూరి జయరాం కి చాన్స్ ఇస్తున్నారు. నంద్యాల ఎంపీ సీటు కూడా మారుస్తారు అని అంటున్నారు. ఇక చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తిలకి కూడా ఈసారి ఢిల్లీ చాన్స్ ఉండదని అంటున్నారు.

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నుంచి పోటీకి నిలబెడుతున్నారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్లేస్ లో వైవీ సుబ్బారెడ్డికి చాన్స్ ఇస్తున్నారు అని తెలుస్తోంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని మారుస్తారు అని టాక్ ఉంది. అలాగే నర్సారావుపేట ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయలుని గుంటూరు ఎంపీగా పోటీ చేయమంటున్నారు

ఆయన నో అంటే కొత్త అభ్యర్ధి వస్తారు. విజయవాడ ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసిన పీవీవీ పార్టీకి దూరం అయ్యారు. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టికెట్ వైసీపీ ఇస్తోంది. మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరీని ఏలూరు ఎంపీగా పంపిద్దామని చూస్తున్నారు. అక్కడ కొత్త ముఖానికి చోటిస్తారు అంటున్నారు. అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి పోటీ నుంచి తప్పుకుంటున్నారు అని తెలుస్తోంది.

అమలాపురం నుంచి ఎంపీగా ఉన్న చింతా అనూరాధకు పి గన్నవరం ఎమ్మెల్యేగా చాన్స్ ఇస్తారని అంటున్నారు. అక్కడ కొత్తవారికి ఎంపీ చాన్స్ అని అంటున్నారు. కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం టికెట్ ని ఇస్తున్నారు. కాకినాడ ఎంపీ టికెట్ ని ముద్రగడ కుటుంబానికి కానీ చలమలశెట్టి సునీల్ కి కానీ ఇస్తారని అంటున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ని రాజమండ్రి అర్బన్ నుంచి పోటీకి రెడీ చేస్తున్నారు. అక్కడ ఎంపీ సీటుని బీసీలకు ఇస్తారని అంటున్నారు.

నర్సారావుపేట ఎంపీ సీటులో రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఉన్నారు. ఆ సీటులో గోకరాజు గంగరాజు కుటుంబానికి ఇస్తారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రా విషయానికి వస్తే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. ఎంపీ సీటుని బొత్స ఝాన్సీరాణికి ఇస్తున్నారు. అనకాపల్లి ఎంపీగా ప్రస్తుతం ఉన్న భీశెట్టి సత్యవతి ప్లేస్ లో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని పోటీ చేయిస్తున్నారు అని అంటున్నారు.

అరకు ఎంపీ సీటు నుంచి ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. అరకు ఎంపీగా పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని పోటీకి రెడీ చేస్తున్నారు. విజయనగరం ఎంపీ టికెట్ ని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఇస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ టికెట్ మీద పోటీకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో పాటు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

మొత్తం మీద చూస్తే ఎంపీ సీట్లు అన్నింటికీ కొత్త వారినే వైసీపీ బరిలోకి దింపుతోంది. ఒక్క మిధున్ రెడ్డి మాత్రమే మినహాయింపు. ఆయన 2014 నుంచి వరసగా అదే సీటు నుంచి గెలుస్తున్నారు. వైసీపీకి లోక్ సభలో లీడర్ గా ఉంటున్నారు.

ఈసారి కూడా ఎక్కువ మంది ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో 2024 లో ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది అంటున్నారు. మొత్తం మీద ఈ మార్పుచేర్పులలో కొందరు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా చాన్స్ వస్తే మరి కొందరిని మాత్రం ఏకంగా పక్కనే పెడుతున్నారు అని అంటున్నారు.