Begin typing your search above and press return to search.

ఈ ముగ్గురు మీద యూట్యూబర్లు 2 లక్షల డాలర్లు సంపాదించారా?

ఫుల్ ఫేమస్ అయిపోతుంటారు. ఇక అక్కడనుంచి వరుసపెట్టి యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. వీళ్లకు ఫుల్ క్రేజ్ వచ్చేస్తుంటుంది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 9:44 AM GMT
ఈ ముగ్గురు మీద యూట్యూబర్లు 2 లక్షల డాలర్లు సంపాదించారా?
X

ఈ మధ్యకాలంలో రాత్రికి రాత్రి యూట్యూబ్ లలో స్టార్ లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. వారు ఎవరైనా, వాళ్లు చేసే పని ఏమైనా.. సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రే వాళ్లు ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంటారు. ఫుల్ ఫేమస్ అయిపోతుంటారు. ఇక అక్కడనుంచి వరుసపెట్టి యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. వీళ్లకు ఫుల్ క్రేజ్ వచ్చేస్తుంటుంది.


అలా ఫేమస్ అయినవాళ్లలో ప్రధనంగా ముగ్గురు మాత్రం ట్రెండింగ్ లో ఉంటున్నారు. వారిలో ఒకరు కుమారీ ఆంటీ కాగా.. మిగిలిన ఇద్దరూ కుర్చీ తాత, లోకులు కాకులు ఆంటీ! అయితే ఆ క్రేజ్ వల్ల వాళ్ల ఆదాయం ఎలా ఉంటుందనే సంగతి కాసేపు పక్కనపెడితే... వీళ్ల వల్ల యూట్యూబర్స్ కి మాత్రం ఇన్ కం ఫుల్ గా ఉంటుందనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అది కూడా భారీ ఎత్తున ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... కుమారి ఆంటీ, కుర్చీ తాత, లోకులు కాకులు అంటీ వళ్ల యూట్యూబర్స్ కి భారీగా ఆదాయం ఉంటుందని.. వీరి వీడియోలకు ఫుల్ ఫాలోయింగ్ ఉంటుండటంతో మిలియన్ లలో వ్యూస్ వస్తున్నాయి! దీంతో వారి వీడియోలకు యూట్యూబ్ ఆదాయం లక్షల్లో ఉంటుందని.. ఈ క్రమంలో వీరి ముగ్గురు వల్లా యూట్యూబర్స్ సుమారు 2 లక్షల డాలర్లు సంపాదించారనే చర్చ తెరపైకి వచ్చింది. వారి గురించి ఇప్పుడు చూద్దాం...!

కుర్చీ తాత!:

"కుర్చీ మడతపెట్టి" అనే డైలాగ్‌ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు కుర్చీ తాత. మహేష్ బాబు లేటేస్ట్ "గుంటూరు కారం" సినిమాలో "కుర్చీ మడత పెట్టి" అనే పదంతో సాంగ్‌ కూడా పెట్టారు. అది భారీ హిట్ ని సొంతం చేసుకుంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఈ డైలాగ్ వాడుకున్నారంటే... నెట్టింట కుర్చీ తాత ఎంత ఫేమస్ అనేది అర్ధంచేసుకోవచ్చు.

కాగా... కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్‌ లో కృష్ణ కాంత్ పార్క్ వద్ద తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయ్యాడు. ఈయన యూట్యూబర్స్ కి కామధేనువు అని అంటున్నారు.

లోకులు కాకులు ఆంటీ:

"లోకులు కాకులు ఆంటీ"గా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు జ్యోతి!"ఆంటీ ఏంటి? అమ్మ అనురా నా కొడుక" అంటూ ఆప్యాయంగా మందలిస్తుంది. "సెల్ఫీలు తీసుకోవద్దురా.. ఒరే... మంచిగా అమ్మ అనురా నన్ను" అంటూ అందరితో ఆప్యాయంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది.

జగన్ ఎమ్మెల్యే టిక్కెట్, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానన్నాడు అని.. రకరకాలా మాటలు చెబుతూ ఉంటుంటుంది! ఈ క్రమంలో ఆమెకు కూడా నెట్టింట ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో... ఈ వీడియోలకూ మిలియన్స్ వ్యూస్ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈమె కూడా యూట్యూబర్స్ కి కల్పతరువు అని అంటున్నారు.

కుమారి ఆంటీ:

ఇటీవల ఓ రీల్ తో సోషల్ మీడియాలో బాగా పాపులార్ అయిన "కుమారి ఆంటీ" నెట్టింట తాజా సంచలనం అనే చెప్పాలి. హైదరాబాద్ లో రోడ్డు పక్కన మీల్స్ బండి రన్ చేస్తూ జీవితం సాగించే కుమారి ఆంటీ తన వద్ద నాన్ వెజ్ వంటల ధరలు, కస్టమర్స్ తో మాట్లాడే విధానంతో బాగా పాపులార్ అయింది. ఇటీవల కాలంలో ఆమె బండిని ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో... ఒక్కసారిగా ఫుల్ వైరల్ అయిపోయింది!

సోషల్ మీడియా, యూట్యూబర్స్, సందీప్ కిషన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం కుమారి ఆంటీ దగ్గరికి వెళ్లి మరింత ఫేమస్ చేశారు. ఈ క్రమంలో ఆమె బండిని పోలీసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేయగా... సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లి మరీ ఇష్యూ సాల్వ్ అవ్వడంతో కుమారి ఆంటీ మరింత పాపులర్ అయింది. ఇప్పుడు ఈమెకూడా యూట్యూబర్స్ కి వరంగా మారిందని అంటున్నారు.