Begin typing your search above and press return to search.

యోగి మాస్ వార్నింగ్.. మాఫియా ప్యాంట్లు తడవాలి!

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాద్ మాఫియాకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో

By:  Tupaki Desk   |   11 April 2024 5:26 AM GMT
యోగి మాస్ వార్నింగ్.. మాఫియా ప్యాంట్లు తడవాలి!
X

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాద్ మాఫియాకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. మోడీ మాష్టారు కలలు కంటున్న 370 మార్కు దాటాలన్నా.. 400 ప్లస్ సీట్లు కూటమి సొంతం చేసుకోవాలన్నా ఉత్తరప్రదేశ్ లో ఉన్న అత్యధిక ఎంపీ సీట్లలో మెజార్టీ కమలం ఖాతాలో పడితే మాత్రమే సాధ్యమవుతుంది.

ఈ నేపథ్యంలో యూపీపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది కమలం పార్టీ. యూపీలో యోగి సర్కారు సాధించిన విజయాల్ని పదే పదే ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ముజఫర్ నగర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మాఫియా దుస్థితి ఎలా ఉందో చూడొచ్చన్న ఆయన.. గతానికి వర్తమానానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రస్తావించటం గమనార్హం.

గతంలో ఎవరి పేరు చెబితే కర్ప్యూ వాతావరణం ఏర్పడేదో.. వాళ్ల పరిస్థితి ఇప్పుడెలా ఉందో మీరే చూస్తున్నారన్న యోగి.. సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాఫియా లీడర్ల కాన్వాయ్ కోసం ముఖ్యమంత్రి కాన్వాయ్ సైతం దారి ఇచ్చే పరిస్థితి ఉండేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితులు మారిన వైనాన్ని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత మాఫియా ఫ్యాంట్లు తడుస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. మాఫియాను అంతం చేయటంలో తాము కమిట్ మెంట్ తో పని చేస్తున్నట్లుగా చెప్పటం ద్వారా తాను టార్గెట్ చేసిన వర్గాలకు మాస్ వార్నింగ్ ఇచ్చేసినట్లుగా చెప్పక తప్పదు.