Begin typing your search above and press return to search.

లోకేష్ ముసుగు తొలగిపోతుందంట... వైసీపీ ట్వీట్ పై తీవ్ర ఆసక్తి!

ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ఒక ట్వీట్ చేసింది. ఇందులో భాగంగా... ఇవాళ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురించి సంచలన విషయం బయటపెట్టబోతున్నట్లు వెల్లడించింది.

By:  Tupaki Desk   |   18 April 2024 10:54 AM GMT
లోకేష్  ముసుగు తొలగిపోతుందంట... వైసీపీ ట్వీట్  పై తీవ్ర ఆసక్తి!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తిపోతున్నాయి. ప్రధానంగా వైసీపీ - టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ తన అధికారిక ఎక్స్ లో ఒక ట్వీట్ చేసింది. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అన్నట్లుగా ఉన్న ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అవును.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శల దాడులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవ్వడంతో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ సారి రెబల్స్ కూడా ఎక్కువగానే ఉండొచ్చని అంటున్నారు. మరోపక్క జగన్ పై దాడికి సంబంధించిన కేసు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ఒక ట్వీట్ చేసింది. ఇందులో భాగంగా... ఇవాళ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురించి సంచలన విషయం బయటపెట్టబోతున్నట్లు వెల్లడించింది. దీంతో... లోకేష్ గురించి వైసీపీ చెప్పబోయే ఆ విషయం ఏమిటో అనే చర్చ నెట్టింట వైరల్ గా మారింది.

ఇదే సమయంలో... "పప్పు పులికేశ్ అబద్ధాల గురించి చెప్పబోతున్నాం. ఇవాళ అతని మాస్క్ తొలగిపోతుంది. లొకేష్ నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారు" అని తన ట్వీట్ లో వైసీపీ రాసుకొచ్చింది. దీంతో... ఈ విషయం తీవ్ర వైరల్ గా మారింది!

ఈ నేపథ్యంలో... వైసీపీ ఈ స్థాయిలో ఆసక్తి కలిగించేలా చేసిన ట్వీట్ ప్రకారం ఏమి చెప్పబోతున్నట్లు అనే చర్చ మొదలైంది. పైగా... లోకేష్ నామినేషన్ దాఖలు చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న రోజే ఇలాంటి ప్రకటన వైసీపీ నుంచి రావడం మరింత ఆసక్తిగా మారింది. మరి.. వైసీపీ చెప్పబోతోన్న లోకేష్ నిజస్వరూపం ఏమిటనేది వేచి చూడాలి!