Begin typing your search above and press return to search.

ఏ2 గా ఎమ్మెల్సీ అనంత బాబు భార్య

కొన్నేళ్ళ క్రితం గోదావరి జిల్లాలనే కాదు యావత్తు ఏపీలోనే కలకలం రేపిన హత్య కేసు ఒకటి ఉంది నాటి వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అది.

By:  Satya P   |   18 Feb 2026 6:46 PM IST
ఏ2 గా  ఎమ్మెల్సీ  అనంత బాబు  భార్య
X

కొన్నేళ్ళ క్రితం గోదావరి జిల్లాలనే కాదు యావత్తు ఏపీలోనే కలకలం రేపిన హత్య కేసు ఒకటి ఉంది నాటి వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అది. ఈ కేసులో సుబ్రహ్మణ్యాన్ని హత్య ఘటనకు సంబంధించి ఏకంగా ఆయన ఇంటికే శవాన్ని కారులో తీసుకెళ్ళి అప్పగించారు అన్నది మరో సంచలనం. ఈ విధంగా ఈ హత్య కేసు ఎన్నో సంచలనాలను వేదిక అయింది. వైసీపీ అధికారంలో ఉన్న వేళ ఎమ్మెల్సీగా అనంత బాబు తన హవాని రంప చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో చలాయించేవారు అని విమర్శలు ప్రత్యర్ధులు గుప్పించారు. ఈ మీదట స్వయానా ఆయన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరగడం సైతం రాజకీయంగా తీవ్ర కలకలం రేపడమే కాదు వైసీపీకి కూడా గోదావరి జిల్లాలలో రాజకీయంగా ఇబ్బందిపడేలా చేసింది.

కొత్తగా చార్జిషీటు :

ఇక ఈ కేసుకు సంబంధించి చూస్తే అనంత బాబు ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. ఇపుడు కొత్తగా ఆయన భార్య మీద కూడా పోలీసులు చార్జిషీట్ నమోదు చేయడం విశేషం. ఆ విధంగా ఈ కేసులో కీలకమైన అడుగు పడింది అని అంటున్నారు. ఆమె ఈ హత్య కేసులో రెండో నిందితురాలు అని పోలీసులు చార్జి షీట్ దాఖలు చేయడం మీద చర్చ సాగుతోంది. తాజాగా రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ మేరకు పోలీసులు చార్జి షీట్ దాఖలు చేశారు. ఈ విధంగా ఎమ్మెల్సీ భార్యను ఈ కేసులో రెండో నిందితురాలిగా పేర్కొనడంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది అని అంతా భావిస్తున్నారు.

ఆసలేమి జరిగిందంటే :

వైసీపీకి చెందిన అనంత బాబు తూర్పు గోదావరి జిల్లాలోని స్థానిక సంస్థల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. ఇక 2022 మే నెలలో ఆయన తన డ్రైవర్ వీధి సుబ్రమణ్యంను హత్య జరిగింది. ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందని అనుమానం మీద ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు. ఆ మీదట ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోర్టు విధించింది. అంతే కాదు వీధి సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీకి సంబంధించిన కంపెనీలు ఇతర కార్యకలాపాల గురించి తెలుసని అందుకే తన మాజీ డ్రైవర్ ఈ రహస్యాలను బయటపెడతాడని ఆయన భయపడి, తనను చంపేస్తాడని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో వీధి సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాల కారణంగా మరణించాడని ఇక అనంత బాబు అతన్ని ఆసుపత్రిలో చేర్చే ప్రయత్నం చేయడం ద్వారా హత్యను ప్రమాదంగా దాచిపెట్టడానికి ప్రయత్నించారని కూడా అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. పెను సంచలనమే కాదు, రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో ఇపుడు ఏ2గా ఎమ్మెల్సీ భార్యను చేర్చడంతో ఈ కేసులో మరెన్ని మలుపులు ఉన్నాయో అని అంతా చర్చించుకుంటున్నారు.