ఫేడ్ అవుట్ అవుతున్న వైసీపీ నేతలు ..!
ఇప్పుడు ఏం చేయాలి? అనేది వైసీపీలో కొన్నాళ్లుగా వినిపిస్తున్న ప్రశ్నే. ఎందుకంటే.. టీడీపీని తీసుకుంటే.. ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది.
By: Tupaki Desk | 27 May 2025 12:30 AMవైసీపీ నాయకులు ఫేడ్ అవుతున్నారు. అంటే.. ప్రజలు వారిని చూసి విసుక్కుంటున్నారు. గతరెండు రోజులు గా మీడియా ముందుకు పేర్ని నాని, అంబటి రాంబాబు సహా మరికొందరునాయకులు వచ్చారు. వారు వంశీ సహా పవన్ కల్యాణ్ సినిమాపై స్పందించారు. కానీ.. ప్రజల నుంచి ఎలాంటి సింపతీ రాకపోగా.. వారు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా పైరయ్యారు. వాస్తవానికి వైసీపీ ఓడిపోయి ఏడాది అవుతోంది. ఈ క్రమంలో సింపతీఅంతో ఇంతో రావాలి. రాలేదు. అంటే.. నాయకులు ఫేడ్ అయ్యారు.
ఇప్పుడు ఏం చేయాలి? అనేది వైసీపీలో కొన్నాళ్లుగా వినిపిస్తున్న ప్రశ్నే. ఎందుకంటే.. టీడీపీని తీసుకుంటే.. ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఒకప్పుడు తెరచాటున ఉన్న పట్టాభిని 2019-24 మధ్య మీడియా ముందు కూర్చోబెట్టారు. ఆయనఅనతి కాలంలోనే దూకుడుగా స్పందించారు. తద్వారా కొత్త ముఖం కనిపించేసరికి ప్రజలకు ఆయనకు ఎట్రాక్ట్ అయ్యారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త వారిని ఎంటర్ చేస్తూ వచ్చారు.
ఆ తరహా రాజకీయాలు.. ప్రయోగాలు ఇప్పుడు వైసీపీకి అవసరం. కానీ.. ముందుకు వచ్చేవారు కనిపించక పోగా.. వారిని ప్రోత్సహించేవారు కూడా లేకుండా పోయారు. ఒకప్పుడు రోజా మీడియా ముందుకు వచ్చేవా రు. కానీ, ఆమెకు వీవర్స్ తగ్గిపోయారు. దీంతో వరుదు కళ్యాణిని తీసుకువచ్చారు. ఈ ప్రయోగం ఫలించిం ది. ఆ తర్వాత.. ఓ యాంకర్ను తీసుకువచ్చినా.. ఆమె సామాజిక మాధ్యమాల కేసులో చిక్కుకుని సైలెంట్ అయ్యారు. దీంతో మహిళల్లోనూ మాట్లాడే వారు కనిపించడం లేదు.
ఇక, యువకులు ఉన్నా.. వారికి సరైన వేదిక కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీ పీ కొత్త నేతలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన తెరమీదికి వచ్చింది. ఇప్పటికి ప్పుడు కాకపోయినా.. త్వరలోనే అయినా.. మార్పుల దిశగా అడుగులు వేయకపోతే.. వైసీపీ తరఫున వినింపించే మాట ప్రజలకు చేరువ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.