Begin typing your search above and press return to search.

ఎల్బీ స్టేడియంలో కొట్టుకున్న పహిల్వాన్లు... వీడియో వైరల్!

అవును... ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కుస్తీ పోటీల్లో శుక్రవారం రాత్రి జరిగిన ముగింపు ఉత్సవాల్లో రచ్చ జరిగింది

By:  Tupaki Desk   |   7 Oct 2023 9:35 AM GMT
ఎల్బీ స్టేడియంలో కొట్టుకున్న పహిల్వాన్లు... వీడియో వైరల్!
X

బషీర్‌ బాగ్‌ ఎల్బీ స్టేడియంలో గత 3 రోజులుగా మోడీ కేసరి దంగల్ (కుస్తీ) పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోటీల చివరి రోజైన శుక్రవారం రాత్రి కుస్తీ పోటీల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఇద్దరు పహిల్వాన్‌ ల మధ్య వాగ్వాదం కాస్తా పెద్ద రచ్చకు దారి తీసింది. దీంతో స్టేడియంలో భయానక వాతావరణం ఏర్పడింది.

అవును... ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కుస్తీ పోటీల్లో శుక్రవారం రాత్రి జరిగిన ముగింపు ఉత్సవాల్లో రచ్చ జరిగింది. ఇందులో భాగంగా.. ఇద్దరు పహిల్వాన్‌ ల మధ్య వాగ్వాదం గొడవకు దారి తీసిందని తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఇద్దరు పహిల్వాన్‌ పోటీలో ఉండగానే, వారితో పాటు వచ్చిన ఇరువర్గాల సభ్యుల ఘర్షణకు దిగి, దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.

దీంతో ఎల్బీ స్టేడియం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో ప్రేక్షకుల్లో కూడా కొందరు గాయపడ్డారని తెలుస్తుంది. ఇలా రెండు వర్గాలకు చెందిన పహిల్వాన్‌ ల మద్య మొదలైన గొడవతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. అయితే ఎవరివల్ల ఈ ఘటన జరిగిందనే విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ... ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.