Begin typing your search above and press return to search.

బిడ్డను రైల్లో నుంచి విసిరేస్తామని బెదిరించి రైల్లో రేప్

తాము చెప్పినట్లుగా వినకపోతే.. బాధితురాలితో ఉన్న చంటి బిడ్డను రైల్ నుంచి బయటకు విసిరేసి చంపేస్తామని బెదిరింపులకు దిగారు.

By:  Tupaki Desk   |   8 Aug 2023 5:24 AM GMT
బిడ్డను రైల్లో నుంచి విసిరేస్తామని బెదిరించి రైల్లో రేప్
X

అమానుష ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాల్సిందే. వినేందుకే వణికేలా ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. చంటిబిడ్డతో కలిసి రైల్లో ప్రయాణిస్తున్న మహిళను దారుణంగా బెదిరించి.. కదులుతున్న రైల్లో రేప్ చేసిన ఉదంతం షాకింగ్ గా మారింది.

అసోం నుంచి పశ్చిమ బెంగాల్ కు వెళుతున్న రైల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారటమే కాదు.. సంచలనంగా మారింది.

గుహవాటి నుంచి పశ్చిమబెంగాల్ లోని అలీపుర్ ద్వార్ వెళ్లే సిఫాంగ్ ఎక్స్ ప్రెస్ రైల్లో చంటిబిడ్డతో ప్రయాణమైంది బాధితురాలు. గుహవాటిలో మధ్యాహ్నం వేళలో ఈ రైలు ఎక్కినట్లుగా చెబుతున్నారు. ఫకీరాగ్రామ్ వరకు వచ్చేసరికి రైలు ఖాళీ అయ్యింది. బాధితురాలు ప్రయాణిస్తున్న బోగీలో అసోంకు చెందిన పాతికేళ్ల అబ్దు.. 26 ఏల్ల మొయినుల్ హక్ అనే ఇద్దరు మహిళను కట్టేసి.. కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారు.

తాము చెప్పినట్లుగా వినకపోతే.. బాధితురాలితో ఉన్న చంటి బిడ్డను రైల్ నుంచి బయటకు విసిరేసి చంపేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో.. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

రైలు అలీపుర్ ద్వార్ జంక్షన్ వద్దకు చేరుకున్న తర్వాత రైల్వే పోలీసులకు తనకు జరిగిన అన్యాయం గురించి వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విషయాన్ని సీరియస్ గా తీసుకొని గాలింపులు చర్యలు చేపట్టారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే.