Begin typing your search above and press return to search.

"మద్యం, మాంసం ఇస్తేనే ఇంటికి వస్తాను"... భార్య వింత డిమాండ్!

అవును... తాజాగా ఒక భార్య తన భర్తతో ఒక వింతైన కోరిక కోరిందట. ప్రతీ రోజూ మద్యం, మాంసం ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట.

By:  Tupaki Desk   |   23 March 2024 10:30 AM GMT
మద్యం, మాంసం ఇస్తేనే  ఇంటికి వస్తాను... భార్య వింత డిమాండ్!
X

ఎపుడో చెప్పెను వేమన గారూ.. అపుడే చెప్పెను బ్రహ్మంగారూ.. ఇపుడే చెబుతా వినుకో బుల్లమ్మా.. అంటూ గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాటపాడతారు. ఈ వార్త చదివిని తర్వాత సరదాకైనా ఒకసారి ఆ పాట వినాలనిపించినా ఆశ్చర్యం లేదు! ఎందుకంటే... తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం అలాంటింది. రోజూ మద్యం, మాంసం ఇస్తేనే ఇంటికి వస్తానంటూ వింతైన డిమాండ్ చేస్తోంది ఒకరి భార్య!

అవును... తాజాగా ఒక భార్య తన భర్తతో ఒక వింతైన కోరిక కోరిందట. ప్రతీ రోజూ మద్యం, మాంసం ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. తన డిమాండ్ ను నెరవేర్చకపోతే కాపురానికి తిరిగిరానని పుట్టింటికి వెళ్లి భీష్మించుకుని కూర్చుందంట. దీంతో ఈ విషయం ఇప్పుడు ఆసక్తిగా మరింది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మరోపక్క ఈ డిమాండ్ పై సరదా కామెంట్లూ దర్శనమిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... రాజస్థాన్ లోని బన్స్వారా లో చిరాగ్ - నేహా జైన్ అనే దంపతులు ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా సదరు భర్త చిరాగ్ ఒక ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ప్రకారం... నేహా జైన్ కుటుంబంతో ఉన్న బంధం మేరకు రెండు లక్షల ఎదురు కట్నం ఇచ్చి ఆమెను పెళ్లిచేసుకోవాలని ఒప్పందం కుదిరిందంట. ఈ నేపథ్యంలో 2023 జూన్ లో వీరి వివాహం జరిగిందంట. ఈ క్రమంలో పెళ్లైన కొన్ని రోజులకే ఆమె ప్రవర్తనలో భారీ మార్పు వచ్చేసిందంట.

ఇందులో భాగంగా... ఆమె గంటలు గంటలు ఫోన్ కాల్స్ మాట్లాడేదట. ఇదే సమయంలో అత్తమామల నుంచి అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఇంట్లోకే మద్యం కొని తెచ్చుకుని తాగడం వరకూ వెళ్లిందంట వ్యవహారం. దీంతో వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందంట. ఈ భర్త నచ్చచెప్పడానికి చూస్తుంటే... నేహ సరికొత్త డిమాండ్ చేసిందంట.

ఇందులో భాగంగా ప్రతీరోజూ లిక్కర్, నాన్ వెజ్ అందిస్తేనే అత్తమామల ఇంటికి తిరిగి వస్తానని సూటిగా చెప్పిందంట. అలాకానిపక్షంలో కాపురానికి వచ్చేది లేదని తెగేసి చెప్పిందంట.

దీంతో విసిగి పోయిన చిరాగ్... చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని నేహపై ఫిరాదు చేయడంతో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారంట. స్థానిక కుశాల్ గఢ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆమెకు కౌన్సిలింగ్, ఆమె పుట్టింట్లో వారికి వార్నింగ్స్ ఇస్తున్నారని అంటున్నారు!