Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాకు సుస్థీ.. ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగింది?

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్ కావడం వల్ల మరికొంత మంది వినియోగదారులు ఇబ్బంది తాము వ్యాపారాల‌ను న‌ష్ట‌పోయామ‌ని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   6 March 2024 5:01 AM GMT
సోష‌ల్ మీడియాకు సుస్థీ.. ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగింది?
X

ప్ర‌పంచ వ్యాప్తంగా మెజారిటీ నాయ‌కులు, ప్ర‌జ‌లు ఫాలో అయ్యే సోష‌ల్ మీడియా మాధ్య‌మాలు కొన్ని గంట‌ల పాటు నిలిచిపో యాయి. ఇన్ స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రాఫ్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఈ మాద్యమాల సర్వీసులు డౌన్ అయ్యాయి. దీంతో యూజర్లు గ‌గ్గొలు పెట్టారు. యాప్ లు ఓపెన్ కాకపోవడంతో పదే పదే డేటా ఆఫ్ చేసి ఆన్ చేయడం వంటివి చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్ కావడం వల్ల మరికొంత మంది వినియోగదారులు ఇబ్బంది తాము వ్యాపారాల‌ను న‌ష్ట‌పోయామ‌ని చెబుతున్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో #facebookdown ట్రెండింగ్‌ అవుతోంది. వారి ఫిర్యాదులతో పాటు, వినియోగదారులు దీనికి సంబంధించి ఫన్నీ రియాక్షన్‌లు కూడా ఇస్తున్నారు. ఈ సమయంలో, మెటా యజమాని మార్క్ జుకర్‌బర్గ్ పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పించారు. Zuckerberg యొక్క మార్ఫింగ్ ఫోటోను సైతం పోస్టు చేసిన గేలి చేశారు. ఇందులో జుకర్‌బర్గ్ వైర్ కట్ చేస్తున్నట్టుగా ఉండ‌డం.. అందుకే మెటా సేవ‌లు నిలిచిపోయాయ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేశారు.

కాగా, మెటా కంపెనీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఫేస్‌బుక్‌లో ఫాలోవ‌ర్లు మరిన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. మొదటిసారి ఫేస్‌బుక్ తెరిచిన తర్వాత లాగిన్ సాధ్యం కానప్పుడు, వినియోగదారులు తమ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ మరియు ఆన్ చేశార‌నిమెటా పేర్కొంది.

స్పందించిన మార్క్ జుకర్ బర్గ్

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ డౌన్ కావడంపై మెటా అధినేత మార్గ్ జుకర్ బర్గ్ స్పందించారు. కొద్ది నిమిషాల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని ఓ పోస్టు చేశారు. ‘‘చిల్ గాయ్స్.. కొద్ది నిమిషాలు ఆగండి.. సమస్య పరిష్కారం అవుతుంది’’ అని పోస్ట్ చేశారు. అయితే.. ఎన్ని నిముషాలు వేచి చూసినా.. ఇవి ప‌నిచేయ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

రీజ‌నేంటి?

ఎర్ర‌స‌ముద్రంలో రెండు రోజుల కింద‌ట హౌతీ తీవ్ర‌వాదులు.. కేబుళ్ల‌ను క‌ట్ చేశారు. వీటి మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేసుకునేందుకు కూడా అవ‌కాశం లేకపోవ‌డం.. ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించారు. ఈ క్ర‌మంలోనే వీటికి అంత‌రాయం ఏర్ప‌డింద‌ని ప్ర‌పంచ వ్యాఫ్తంగా నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.