Begin typing your search above and press return to search.

ఆ సీఎం, డీజీపీల‌ను లేపేస్తాం: ప‌న్నూ హెచ్చరిక‌లు

కెన‌డాలో జ‌రిగిన ఓ హ‌త్య వెనుకాల భార‌త్ ఉంద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప‌న్నూ ఇటీవ‌ల కాలంలో రెచ్చిపోతున్నాడు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 3:45 AM GMT
ఆ సీఎం, డీజీపీల‌ను లేపేస్తాం: ప‌న్నూ హెచ్చరిక‌లు
X

ప‌న్నూగా ప‌రిచిత‌మైన ఖలిస్థానీ ఉగ్ర‌వాది, సిఖ్స్ ఫ‌ర్ జ‌స్టిస్ నేత గురు ప‌త్వంత్ సింగ్ ప‌న్నూ.. భార‌త్‌కు కంట్లో న‌లుసుగా మారారు. కొన్నాళ్ల కింద‌ట‌.. భార‌త పార్ల‌మెంటుపై దాడులు చేస్తామ‌న్న ఆయ‌న‌.. అనుకు న్న‌ట్టుగానే దాడులు జ‌రిగాయి. అయితే.. ప‌న్నూకూ.. ఈ దాడులు చేసిన వారికి సంబంధాలు ఉన్నాయా? లేవా? అనేది ఇంకా విచార‌ణ జ‌రుగుతోంది. కెన‌డాలో జ‌రిగిన ఓ హ‌త్య వెనుకాల భార‌త్ ఉంద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప‌న్నూ ఇటీవ‌ల కాలంలో రెచ్చిపోతున్నాడు.

తాజాగా భార‌త్‌పై మ‌రో హెచ్చరిక జారీ చేశాడు ప‌న్నూ. పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ సింగ్ స‌హా.. ఆ రాష్ట్ర డీజీపీ గౌర‌వ్ యాదవ్‌ల‌ను చంపేస్తామంటూ.. ప‌న్నూ హెచ్చ‌రిక‌లు పంపాడు. అది కూడా.. ఈ నెల 26న నిర్వ‌హించ‌నున్న గ‌ణ‌తంత్ర దినోత్స‌వాల సంద‌ర్భంగా.. ఈ ఇద్ద‌రినీ చంపేయాల‌ని ముహూర్తం పెట్టుకున్న‌ట్టు కూడా ప‌న్నూ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఈ నెల 26న సీఎం భ‌గ‌వంత్ మాన్‌పై దాడులు చేసి చంపేసేందుకు గ్యాంగ్‌స్ట‌ర్లు అంద‌రూ క‌ల‌సి రావాల‌ని సైతం ప‌న్నూ పిలుపునివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. అదేవిధంగా డీజీపీని కూడా లేపేసేందుకు స‌హ‌క‌రించాల‌ని ప‌న్నూ పిలుపునిచ్చాడు. దీంతో పంజాబ్ ప్ర‌భుత్వం అలెర్ట్ అయింది. ఈ హెచ్చ‌రికల నేప‌థ్యంలో అటు కేంద్ర ప్ర‌బుత్వానికి ఫిర్యాదు చేయ‌డంతోపాటు.. ముఖ్య‌మంత్రి భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచారు. అదేవిదంగా డీజీపీ భ‌ద్ర‌త‌ను కూడా పెంచారు.

కారణం ఇదీ..

పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్‌ను చంపేస్తామంటూ.. ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది ప‌న్నూ హెచ్చ‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌ల కాలంలో పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం గ్యాంగ్ స్ట‌ర్ల‌కు వ్య‌తిరేకంగా చ‌ర్య‌లు తీసుకుంటోంది. వెతికివెతికి మ‌రీ.. గ్యాంగ్ స్ట‌ర్ల‌పై కేసులు న‌మోదు చేస్తోంది. దీంతో ప‌న్నూ ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది.