Begin typing your search above and press return to search.

డ్రగ్స్‌ పై కార్టూన్స్... క్రియేటివిటీతో ఇచ్చిపడేస్తున్నారుగా!

ఆయా పార్టీలకు చెందిన నెటిజన్లు... వాటిని షేర్స్ మీద షేర్స్ కొడుతూ నెట్టింట హోరెత్తించేస్తున్నారు

By:  Tupaki Desk   |   24 March 2024 5:36 AM GMT
డ్రగ్స్‌ పై కార్టూన్స్... క్రియేటివిటీతో ఇచ్చిపడేస్తున్నారుగా!
X

రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఒకప్పుడు మాటలకు, రాతలకు మాత్రమే పరిమితమవ్వగా.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలు, యానిమేషన్లతో పీక్స్ కి చేరుకుంటుంది. పైగా ఎలక్షన్ టైం కావడంతో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై జరుగుతున్న మీమ్స్, కార్టూన్స్ వైరల్ గా మారుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నెటిజన్లు... వాటిని షేర్స్ మీద షేర్స్ కొడుతూ నెట్టింట హోరెత్తించేస్తున్నారు.

ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తారమత్యాలేమీ లేవు. అన్ని పార్టీల సోషల్ మీడియా జనాలూ ఈ పనుల్లో పోలింగ్ తేదీ వరకూ ఫుల్ బిజీ అన్నట్లుగా చేలరేగిపోతున్నారు. ఈ క్రమంలో.. కొన్ని మీమ్స్ నవ్వు తెప్పించేవిగా, ఆలోచింప చేసేవిగా ఉంటే.. కొన్ని మాత్రం మంటపుట్టించేలా, అసభ్యకరంగా ఉంటున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు వైజాక్ లో సీబీఐ అధికారులకు పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారానికి సంబంధించిన కార్టూన్ వైరల్ గా మారింది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా.. ఏపీలో ప్రత్యేకంగా విశాఖలో సీబీఐ అధికారులు పట్టుకున్న డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో... ఇదంతా అధికార వైసీపీ పనే అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా... ఈ సరుకు తెప్పించుకున్న కంపెనీకి టీడీపీకి ఉన్న సంబంధం ఇది అంటూ వైసీపీ సోషల్ మీడియా జనాలు ఫోటోలతో సహా పోస్టులు పెడుతున్నారు.

దీంతో... ఈ వ్యవహారంపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏపీ అట్టుడికిపోతుంది. ఈ సమయంలో ఒక అడుగు ముందుకేసి వైసీపీ నేతలు సీబీఐ, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై వీలైనంత తొందరగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని కోరారు! ఈ సమయంలో... టీడీపీ - వైసీపీల మధ్య పరస్పరం కార్టూన్ల దాడి షురూ అయ్యింది. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి!

ఇందులో భాగంగా... వైసీపీలో “వై అంటే యువజన, సీ అంటే కొకైన్ - పీ - అంటే పార్టీ” అని రాస్తూ... వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిల ఫేస్ లతో కార్టూన్ క్రియేట్ చేశారు టీడీపీ క్రియేటర్స్! ఇదే సమంలో... టీడీపీ లో... “టీ అంటే తెలుగు, డీ అంటే డ్రగ్స్, పీ అంటే పార్టీ” అని రాస్తూ... చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి ఫోటోలు వేసి కార్టూన్స్ వదిలారు వైసీపీ జనాలు! దీంతో ఇప్పుడు ఈ కార్టూన్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.