Begin typing your search above and press return to search.

కొహ్లీ రెస్టారెంట్ లో ఆర్సీబీ క్రికెటర్స్... ఫ్యాన్స్ ఘాటు రియాక్షన్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 April 2024 11:30 PM GMT
కొహ్లీ రెస్టారెంట్ లో ఆర్సీబీ క్రికెటర్స్... ఫ్యాన్స్ ఘాటు రియాక్షన్!
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సీజన్ లో ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. కేవలం పంజాబ్ తో ఆడిన రెండో మ్యాచ్ లో గెలవడం తప్ప మిగిలిన ఏడు మ్యాచ్ లలోనూ ఓటమి పాలైంది.

ఈ క్రమంలో తాజాగా ఈనెల 21 (ఆదివారం) జరిగిన తన చివరి మ్యాచ్ లోనూ కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో కేవలం రెండు పాయింట్లతో పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25 (గురువారం) సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ స్టేడియంలో తలపడనుంది. ఈ సమయంలో రాయల్ చాలెంజర్స్ జట్టు సభ్యులు కొహ్లీ రెస్టారెంట్ లో సందడి చేశారు.

అవును... కొహ్లీకి సంబంధించిన "వన్ 8 కమ్యూన్" రెస్టారెంట్‌ లో విరాట్, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, వైశాక్ విజయ్‌ కుమార్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్‌ లతో సహా ఆర్సీ జట్టు సభ్యులు సందడి చేశారు. ఈ సమయలో దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ ఫోటో కి రియాక్ట్ అవుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్ & నెటిజన్లు నిప్పులు కక్కుతుండటం గమనార్హం!

ఇందులో భాగంగా... "మీ జట్టు 8 మ్యాచ్‌ లలో 7 ఓడిపోయినప్పుడు.. ఇదంతా చేయడంలో సిగ్గనిపించడం లేదా!" అని ఒకరంటే... "వన్ 8 = 8 మ్యాచ్‌ లలో ఒక విజయం - పాయింట్ల పట్టికలో తన బ్రాండ్‌ ను ప్రమోట్ చేస్తున్న కోహ్లీ" అని మరొకరు కామెంట్ చేశారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే... ఈ ఫోటో కింద ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.

కాగా... ఈ సీజన్ లో ఆడిన 8 మ్యాచ్ లలోనూ 63.17 యావరేజ్ తో 379 పరుగులు చేశాడు కొహ్లీ. ఇందులో రెండు ఆఫ్ సెంచరీలు, ఒక సెంచరీ (113*) ఉన్నాయి. ఇలా 150 స్ట్రైక్ రేట్ తో తదైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా... మరోవైపు ఫినిషర్ దినేష్ కార్తీక్ 251 పరుగులు (రెండు అర్ధ సెంచరీలు) సహకరిస్తున్నా... టీం పెర్ఫార్మెన్స్ లో ఉన్న భారీ లోపాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.