Begin typing your search above and press return to search.

షర్మిల, సునీతలపై మేనత్త వైఎస్ విమల సంచలన వ్యాఖ్యలు!

గతకొన్ని రోజులుగా షర్మిళ, సునీతలు జగన్ పైనా, అవినాష్ పైనా చేస్తున్న విమర్శల సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 April 2024 6:55 AM GMT
షర్మిల, సునీతలపై మేనత్త వైఎస్  విమల సంచలన వ్యాఖ్యలు!
X

గతకొన్ని రోజులుగా షర్మిళ, సునీతలు జగన్ పైనా, అవినాష్ పైనా చేస్తున్న విమర్శల సంగతి తెలిసిందే. ప్రధానంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హంతకుడు చట్టసభల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశ్యంతోనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో వైఎస్సార్‌ సోదరి విమల స్పందించారు. ఇందులో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిళ పోటీ చేయడం.. ఆమెకు సునీత తన మద్దతు తెలపడం.. వీరిద్దరూ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జగన్ – అవినాష్ లపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేయడం రోజు రోజుకీ పెరిగిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం రోజు రోజుకీ చినికి చినికి గాలివానగా మారుతుందనే చర్చ తెరపైకి వచ్చింది! కోర్టు పరిధిలో ఉన్న విషయాలపై నేరుగా నిందితులను నేరస్థులుగా చిత్రీకరించడం ఏమిటనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన వైఎస్సార్ సోదరి విమల... ఇంటి ఆడపడుచులు ఇద్దరూ ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నట్లు తెలిపారు. ఇక తాను కూడా ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నట్లు తెలిపిన విమల... షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసినట్లు చెబుతూ.. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదని స్పష్టం చేశారు!

ప్రతీ రోజూ అదేపనిగా అవినాష్ పై షర్మిళ విమర్శలు గుప్పిస్తున్నారని.. సీఎం జగన్‌ ను కూడా ఇందులోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో... వివేకాను అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా? వాళ్లే డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు? హత్య చేసినవాడు బయట తిరుగుతూ చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇదే క్రమంలో... ఏ పాపం చేయని తమ సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడని గుర్తు చేసిన విమల... అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు! ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు.. మేనత్తగా చెప్తున్నా.. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు.. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.