Begin typing your search above and press return to search.

బాబు ఆత్మని విజయసాయి కలిశారా ?

వైసీపీకి అతి పెద్ద పునాది లాంటి మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి మీద వైసీపీ రగిలిపోతోంది.

By:  Tupaki Desk   |   25 May 2025 9:58 AM
బాబు ఆత్మని  విజయసాయి కలిశారా ?
X

వైసీపీకి అతి పెద్ద పునాది లాంటి మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి మీద వైసీపీ రగిలిపోతోంది. ఏకంగా అధినేత జగన్ అయితే ఆయన చంద్రబాబుకు అమ్ముడుపోయారు అని ఘాటు వ్యాఖ్యలే చేశారు. తన మూడున్నర ఏళ్ళ రాజ్యసభ పదవిని తాకట్టు పెట్టారని కూడా హార్ష్ గానే కామెంట్స్ చేశారు.

విజయసాయిరెడ్డి టీడీపీ పెద్దల ప్రలోభాలకు లొంగిపోయారు అని కూడా జగన్ అన్నారు. జగన్ ఈ విమర్శలు చేసినపుడు రాజకీయ విశ్లేషకులతో సహా చాలా మంది ఎందుకు ఆయన అనవసరంగా విజయసాయిరెడ్డి మీద ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు అని అనుకున్నారు.

బాబుకు ఎంపీ పదవి తాకట్టు పెట్టారు ఏకంగా ఆయనే అమ్ముడుపోయారు అన్నపుడు అంత పెద్ద మాటలు ఎందుకు అని కూడా అనుకున్నారు. అయితే జగన్ పక్కా ఆధారాలతోనే ఈ తరహా కామెంట్స్ చేశారు అని అంటున్నారు. దానికి సంబంధించి ది వైర్ అన్న దాంట్లో ఒక సంచలన కధనం వచ్చింది. విజయసాయిరెడ్డి ఈ మధ్య లిక్కర్ స్కాం విషయంలో సిట్ విచారణకు హాజరయ్యారు దాని కంటే ముందు ఆయన చంద్రబాబుకు ఆత్మలా వ్యవహరించే టీడీ జనార్ధన్ అనే నేతను కలిశారు అన్నది ది వైర్ బయటపెట్టింది అంటున్నారు.

ది వైర్ ఈ విషయం మీద రాసిన కధనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ సహా ది వైర్ బయటపెట్టడం విశేషం. మరుసటి రోజు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయన ముందు రోజు సాయంత్రం టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్ధన్ ని కలిసారు అన్నది ది వైర్ కధనంగా ఉంది.

తాడేపల్లిలోని విల్లా నంబర్ 27కి విజయసాయిరెడ్డి కారు వెళ్ళిందంటూ ది వైర్ సీసీ ఫుటేజ్ సాక్షిగా చెబుతున్నట్లుగా సోషల్ మీడియా కధనాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ విల్లా ఎవరిది అంటే ప్రముఖ నటుడు క్రిష్ణ సోదరుడు సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషరిగిరావుది అని అంటున్నారు. ఇక ఆ విల్లాలోకి వెళ్తూ టీడీ జనార్ధన్ కూడా కనిపించారని ది వైర్ కధనం చెబుతోంది.

ఈ విల్లాలో విజయసాయిరెడ్డి, టీడీ జనార్ధన్ ఇద్దరూ ఒక నలభై అయిదు నిముషాల పాటు భేటీ అయి చర్చించుకున్నారు అన్నది ది వైర్ కధనంగా ఉంది. సీఐడీ విచారణకు కొద్ది గంటల ముందు ఈ సీక్రేట్ మీటింగ్ జరిగింది అని అంటున్నారు.

ఆ తరువాత విజయసాయిరెడ్డి వైసీపీ మీద జగన్ మీద ఆరోపణలు తీవ్ర స్థాయిలో మీడియా ముందు చేశారు అని అంటున్నారు. ది వైర్ ఈ వార్తా కధనాన్ని ప్రముఖంగా ప్రచురించడమే కాకుండా అనూహ్యమైన ఈ భేటీకు అర్ధాలు ఏమిటి అన్న ఆసక్తిని కూడా రేపింది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే తాజాగా జగన్ ప్రెస్ మీట్ లో విజయసాయిరెడ్డి మీద చేసిన ఆరోపణలలో పదును చాలానే ఉంది అని అంటున్నారు మరి విజయసాయిరెడ్డి టీడీపీతో కలసిపోయారా అన్నది ఈ కధనం చూస్తే అందరికీ డౌట్లు అయితే వస్తున్నాయి. మరి దీని మీద విజయసాయిరెడ్డి పెదవి విప్పితే కానీ ఈ విషయం లో క్లారిటీ ఉండదు అని అంటున్నారు.