విజయసాయి బీజేపీలో చేరేది వచ్చే వారమే ?
ఇకా మరో రెండు మూడు నెలల పాటు ఇలాగే ఉండి జూన్ లేదా జూలైలో బీజేపీలో చేరాలని విజయసాయిరెడ్డి తలచారు అని అంటారు.
By: Tupaki Desk | 1 April 2025 11:30 PMవైసీపీ విజయసాయిరెడ్డి ఇక మీదట బీజేపీ విజయసాయిరెడ్డిగా మారనున్నారా అంటే రాజకీయ పరిణామాలు చూస్తే అవును అనే అంటున్నాయి. ఇటీవల విజయవాడలో పాత్రికేయులతో మాట్లాడుతూ కూడా విజయసాయిరెడ్డి ఒక విషయం మీద క్లారిటీగా మాట్లాడారు. తాను ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను అని. అంటే ఫ్యూచర్ లో ఏమి జరుగుతుందో చెప్పలేను అన్నట్లే కదా అని నాడే అంతా అనుకున్నారు. ఇక విజయసాయిరెడ్డి జూన్ లో బీజేపీలో చేరుతారు అని అనుకుంటే అది కాస్తా ఇపుడు ముందుకు తోసుకొస్తోందని అంటున్నారు. ఆయన వచ్చే వారమే కమలం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అని అంటున్నారు.
ఈ మేరకు అన్ని రకాలైన సంప్రదింపులు పూర్తి అయ్యాయని అంటున్నారు. విజయసాయిరెడ్డి జనవరి 25న తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు వైసీపీకి గుడ్ బై కొట్టారు. తాను వ్యవసాయం చేసుకుంటాను అని కూడా చెప్పారు. ఇక రాజకీయ సన్యాసమే అని అన్నారు. కానీ ఆయన ఇపుడు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు.
అయితే ఆయన రాజీనామా కంటే ముందే ఇదంతా అనుకుని చేసారు అని అంటున్నారు. ఇలా వైసీపీకి రాజీనామా చేసి అలా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే అది రాజకీయంగా ఇబ్బంది అని భావించే ఆయన మూడు నెలల పాటు ఈ రకమైన రాజకీయ దూరాన్ని కావాలనే కోరుకున్నారు అని అంటున్నారు.
ఇకా మరో రెండు మూడు నెలల పాటు ఇలాగే ఉండి జూన్ లేదా జూలైలో బీజేపీలో చేరాలని విజయసాయిరెడ్డి తలచారు అని అంటారు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం ఆయన మీద ఒత్తిడి పెంచారు అని అంటున్నారు. ఎక్కువ కాలం కనుక రాజకీయంగా దూరంగా ఉంటే అది కూడా ఇబ్బంది అవుతుందని చాన్స్ ఉన్నపుడు అవకాశాలు అందివచ్చినపుడే అందుకోవాలన్న వారి సూచనలు సలహాలతో పాటు ఆయన కూడా వ్యూహాత్మకంగా ఆలోచించే బీజేపీలో చేరిపోతున్నారు అని అంటున్నారు.
బీజేపీలో ఈ టైం లో చేరడం వల్ల లాభం ఏంటి అంటే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఏప్రిల్ లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది అని అంటున్నారు. ఈ లోగా కనుక విజయసాయిరెడ్డి బీజేపీలో ఉంటే కనుక తిరిగి ఆయనకే పార్టీ ఆ ఎంపీ సీటు ఇచ్చే చాన్స్ అధికంగా ఉందని అంటున్నారు.
అంటే బీజేపీ ఎంపీగా ఏపీ నుంచే నెగ్గి మరీ విజయసాయిరెడ్డి మళ్ళీ పార్లమెంట్ లో అడుగు పెడతారు అని అంటున్నారు. ఇక చూస్తే కనుక ఈ నెల 4వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్నాయి. అది జరిగిన ఒకటి రెండు రోజుల తేడాలో కమలం పార్టీలో విజయసాయి రెడ్డి చేరిక అన్నది ఉండవచ్చు అని అంటున్నారు. సో విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగడం ఖాయమని అంటున్నారు.