Begin typing your search above and press return to search.

భార్యబిడ్డలను చంపిన కానిస్టేబుల్ సూసైడ్ నోట్ లో షాకింగ్ విషయాలు!

కడపలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్థానిక కోఆపరేటివ్ కాలనీలో నివాసముంటున్న వెంకటేశ్వరులు అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీ కాల్చి చంపేశాడు

By:  Tupaki Desk   |   5 Oct 2023 9:53 AM GMT
భార్యబిడ్డలను చంపిన కానిస్టేబుల్ సూసైడ్ నోట్ లో షాకింగ్ విషయాలు!
X

కడపలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్థానిక కోఆపరేటివ్ కాలనీలో నివాసముంటున్న వెంకటేశ్వరులు అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీ కాల్చి చంపేశాడు. ఆపై వెంకటేశ్వరులు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్దార్ధ కౌశల్‌ కు సూసైడ్ నోట్ రాశాడు. ఆ నోట్ లో పేర్కొన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.

అవును... కడప నగరంలోని టుటౌన్ పోలీస్‌ స్టేషన్‌ లో రైటర్‌ గా పనిచేస్తున్నాడు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ నుంచి ఒక తుపాకీని తన వెంట తీసుకుని వచ్చాడు. అలా ఇంటికి వచ్చిన అనంతరం... భార్యాబిడ్డలను చంపడమే కాకుండా.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయంపై స్థానికులు స్పందించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో... అప్పులు, ఆర్ధిక సమస్యల వల్ల కుటుంబ కలహాలున్నట్లు బంధువులు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన సూసైడ్ నోట్ తాజాగా చర్చనీయాంశం అయ్యింది.

ఆత్మహత్య చేసుకునే ముందు కడప ఎస్పీ సిద్దార్ధ కౌశల్‌ కు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సూసైడ్ నోట్ రాశాడు. అయితే... ఆ నోట్ లో కాల్పుల ఘటన, తన ఆత్మహత్యకు గల కారణాలు పేర్కొనలేదు కానీ... తన మరణం అనంతరం వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఎవరికి దక్కాలి అనే విషయంపై మాత్రం వివరాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... తన మరణానంతరం తనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ తన రెండవ భార్య రమాదేవి కుటుంబానికి చెందేలా చూడాలని సూసైడ్ నోట్‌ లో ఎస్పీకి విన్నవించాడట వెంకటేశ్వర్లు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనకు గల పూర్తి కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది!