Begin typing your search above and press return to search.

ఆంధ్రా గిరిజన యువకుడి ముఖం పై మూత్ర విసర్జన?

గిరిజన యువకుడి పై దాడి చేసి ముఖం పై మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లో వెలుగు చూసిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   19 July 2023 10:02 AM GMT
ఆంధ్రా గిరిజన యువకుడి ముఖం పై మూత్ర విసర్జన?
X

మధ్యప్రదేశ్‌ లో గిరిజన కూలీ పై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఆంధ్రప్రదేశ్ లో నూ ఇలాంటి అమానవీయ ఘటనే జరిగిందనే విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిందని తెలుస్తుంది.

అవును... గిరిజన యువకుడి పై దాడి చేసి ముఖం పై మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లో వెలుగు చూసిందని తెలుస్తుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం లో నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు తాజాగా వెలుగు లోకి వచ్చాయని తెలుస్తుంది.

నిందితుడికి, బాధితుడికి మధ్య జరిగిన గొడవే ఈ ఘటన కు కారణం అని తెలుస్తుంది. నిందితులు, బాధితుడూ ఇద్దరూ నేర నేపథ్యం ఉన్నవారేనని అంటున్నారు. ఈ దాడి లో తొమ్మిది మంది యువకులు పాల్గొన్నారని అంటున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో ప్రసారమవుతున్నాయని తెలుస్తుంది. ఈ వీడియో క్లిప్‌ లో... బాధితుడు తీవ్ర రక్తస్రావంతో ఉండగా... దాడి చేసిన వారిని రక్షించమని వేడుకుంటున్న దృశ్యం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో కొందరు నిందితులు.. సదరు బాదితుడి ముఖం పై మూత్రం పోసి తాగమని అడిగినట్లు ఉందని తెలుస్తుంది.

ఈ కేసు లో నిందితుడు, బాధితుడు చిన్ననాటి స్నేహితులు అని అంటున్నారు. పైగా వీరిద్దరి పై సుమారు 40-50 కేసుల్లో ప్రమేయం ఉన్నవారని సమాచారం. గతం లో బాదితుడిని పోలీసులు పలు కేసుల్లో అరెస్టు చేసి జైలు లో కూడా ఉంచారని తెలుస్తుంది. ఇక నిందితుడు మాత్రం పోలీసుల కు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల వారి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తుంది.

నెల రోజుల క్రితం నిందితుడు.. బాదితుడిని కిమ్స్‌ మెడికల్‌ కాలేజీ వెనుక ప్రదేశానికి పిలిచాడట. అక్కడికి బాధితుడు చేరుకునే సమయానికి నిందితుడు మరో ఎనిమిది మంది అక్కడ ఉన్నారట. ఆ సమయం లో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని అంటున్నారు. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న దుండగులు.. బాధితుడిని నిర్దాక్షిణ్యంగా కొట్టారని చెబుతున్నారంట.

దీంతో తీవ్ర రక్తస్రావమైన గాయాల తో బాధితుడు నేల పై పడుకున్నప్పుడు.. కనీసం ముగ్గురు నేరస్థులు అతని ముఖం పై మూత్ర విసర్జన చేశారని తెలుస్తుంది. ఆ సమయం లో ఈ నీతిమాలిన చర్యల ను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారని అంటున్నారు. ఈ మేరకు ఆ విషయాలు వీడియోలు వినిపిస్తున్నాయని అంటున్నారు.

ఈ విషయం పై బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని తెలుస్తుంది. ఈ ఫిర్యాదు పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారని తెలుస్తుంది. అయితే ఈ కేసు కు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు అనే విషయం పై స్పష్టత లేదు. ఈ సంఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!