ఒళ్లు గగుర్పొడిచే ఆచారాలు..ఇక్కడ చనిపోయిన వారిని బంధువులే తింటారు!
కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారాలు వింతగా ఉంటాయి. వాటి గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
By: Tupaki Desk | 26 April 2025 9:30 AMఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. మృత్యువు ఒక శాశ్వత సత్యం.. దానిని ఎవరూ తప్పించుకోలేరు. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అంత్యక్రియలకు సంబంధించిన రకరకాల ఆచారాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారాలు వింతగా ఉంటాయి. వాటి గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
టిబెట్లో బౌద్ధమతస్తుల అంత్యక్రియల పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలను ఆకాశంలో నిర్వహిస్తారు. ఒక వ్యక్తి మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని రాబందులకు ఆహారంగా వేస్తారు. దక్షిణ కొరియాలో చనిపోయిన వారి అవశేషాలను కంప్రెస్ చేసి టెక్నాలజీ ద్వారా రంగురంగుల పూసలుగా తయారు చేస్తారు. ఇవి రత్నాల రాళ్లలా కనిపిస్తాయి.
పూర్వకాలంలో పాపువా న్యూ గినియాలోని మెలనేషియన్లు, బ్రెజిల్లోని వారి తెగ ప్రజలు తమ తెగకు చెందిన చనిపోయిన బంధువుల అవశేషాలను తినేవారు. ఘానాలో ప్రజలు తమకు ఇష్టమైన వస్తువులతో కలిసి సమాధి చేయడానికి ఇష్టపడతారు. అందుకే అక్కడ చనిపోయిన వారిని వివిధ రకాల శవపేటికల్లో ఖననం చేస్తారు. న్యూ ఓర్లీన్స్లో ప్రజల సంగీత ప్రేమ ప్రత్యేకమైనది. ఇక్కడ ప్రజలు తమ బంధువులకు వీడ్కోలు పలికేటప్పుడు పెద్ద పెద్ద హార్న్లతో కూడిన బ్యాండ్ను వాయిస్తారు.
వాయవ్య ఫిలిప్పీన్స్లో చనిపోయిన వారి బంధువులు వారి కళ్లను దానం చేస్తారు లేదా వారి కళ్లకు గంతలు కట్టేస్తారు. బ్రిటిష్ కొలంబియా, పశ్చిమ యునైటెడ్ స్టేట్స్లోని హైడా తెగ ప్రజలు మృతదేహాన్ని గుజ్జుగా చేసి ఆ గుజ్జును సూట్కేస్లో లేదా పెట్టెలో పెట్టి చనిపోయిన వ్యక్తి ఇంటి బయట పాతిపెడతారు.